Ganga Vilas Cruise: కాశీ క్షేత్రం వారణాసి నుంచి డిబ్రూగఢ్‌కి రివర్ క్రూయిజ్.. 13న లాంచ్ చేయనున్న ప్రధాని

|

Jan 07, 2023 | 11:04 AM

ఈ నౌక 20వ తేదీన ఫరక్కా, ముర్షిదాబాద్ మీదుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి 15 రోజుల పాటు బంగ్లాదేశ్‌లో ప్రయాణిస్తుంది. తర్వాత మళ్లీ శివసాగర్‌ సమీపంలో భారత సరిహద్దులోకి ప్రవేశిస్తుంది. జనవరి 13న ప్రారంభించనున్న

Ganga Vilas Cruise: కాశీ క్షేత్రం వారణాసి నుంచి డిబ్రూగఢ్‌కి రివర్ క్రూయిజ్.. 13న లాంచ్ చేయనున్న ప్రధాని
River Cruise
Follow us on

ఉత్తరప్రదేశ్ లోని కాశీ క్షేత్రం వారణాసి నుంచి బంగ్లాదేశ్‌ మీదుగా అసోంలోని డిబ్రూగఢ్ వరకు 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ రివర్ క్రూయిజ్‌ను జనవరి 13న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ‘గంగా విలాస్ క్రూయిజ్’ పేరుతో ఈ నౌక వారణాసి నుంచి బంగ్లా మీదుగా అస్సాంలోని దిబ్రూగఢ్‌కు 3200 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది. ఈ విలాసవంతమైన నౌకా ప్రయాణాన్ని జనవరి 13న ప్రధాని నరేంద్ర మోడీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. 50 రోజుల పాటు 27 నదుల గుండా ఈ లగ్జరీ క్రూయిజ్ సాగనుంది. అంతేకాకుండా ఈ క్రూయిజ్ షిప్ పర్యాటకులకు ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో సహా 50 వారసత్వ సంపదలుగా భావించే ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించడానికి అవకాశం కల్పిస్తోంది. దాంతో పాటు అదనంగా సుందర్బన్స్ డెల్టా, కజిరంగా నేషనల్ పార్క్‌తో సహా జాతీయ పార్కులు, అభయారణ్యాల గుండా కూడా ఈ షిప్ వెళ్ళనుంది.

గంగా విలాస్ క్రూజ్ గాజీపూర్, బక్సర్,పాట్నా మీదుగా కోల్‌కతా చేరుకుంటుంది. ఈ నౌక గంగ, బ్రహ్మపుత్ర నదులపై సాగుతుంది. సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు, జిమ్, స్పా, అబ్జర్వేటరీ మొదలైనవి ఈ క్రూయిజ్ జర్నీని ఆస్వాదించడానికి అందుబాటులో ఉంచారు. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, కాజిరంగా, సుందర్బన్ నేషనల్ పార్క్‌లలో కూడా ఓడ ఆగుతుంది. క్రూయిజ్ షిప్‌లో అపార్ట్‌మెంట్‌ను 12 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్న మెటా ఉద్యోగి.

ఈ నౌక 20వ తేదీన ఫరక్కా, ముర్షిదాబాద్ మీదుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి 15 రోజుల పాటు బంగ్లాదేశ్‌లో ప్రయాణిస్తుంది. తర్వాత మళ్లీ శివసాగర్‌ సమీపంలో భారత సరిహద్దులోకి ప్రవేశిస్తుంది. జనవరి 13న ప్రారంభించనున్న డ్రైవింగ్ కార్యక్రమానికి అన్ని సన్నాహాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.