ఇన్ఫ్రా రంగంలో బడ్జెట్ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి వెబ్‌నార్.. సాయంత్రం 4గం. ప్రసంగించనున్న ప్రధాని మోడీ

|

Feb 16, 2021 | 1:02 PM

భారత దేశం అభివృద్ధి చెందాలంటే దేశీయ ఇన్ఫ్రా రంగం వేగంగా ఎదగాల్సి ఉందని ప్రధాని మోడీ చెప్పారు. అంతేకాదు ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్ఫ్రా రంగంలో...

ఇన్ఫ్రా రంగంలో బడ్జెట్ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి వెబ్‌నార్.. సాయంత్రం 4గం. ప్రసంగించనున్న ప్రధాని మోడీ
Follow us on

PM Modi Addressing India at 4 PM: భారత దేశం అభివృద్ధి చెందాలంటే దేశీయ ఇన్ఫ్రా రంగం వేగంగా ఎదగాల్సి ఉందని ప్రధాని మోడీ చెప్పారు. అంతేకాదు మౌలిక సదుపాయాల రంగంలో ‌ వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్ఫ్రా రంగంలో కేంద్ర బడ్జెట్ 2021-22 ను సమర్థవంతంగా అమలు చేయడానికి రోడ్‌మ్యాప్ ను రూపొందించాడానికి సలహాలు సంప్రదింపుల కోసం వెబ్‌నార్‌ ను నిర్వహించడానికి కేంద్రం కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రధాని మోడీ ప్రసంగించనున్నారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం ప్రారంభంకానున్నది. ప్రధాన ఆర్థిక సంస్థలు, నిధుల ప్రతినిధులు, రాయితీలు అండ్ కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్స్ మరియు ఆర్ధిక నిపుణులతో సహా 200 మందికి పైగా ప్యానెలిస్టుల భాగస్వామ్యాన్ని వెబ్‌నార్ చూస్తుందని పిఎంఓ తెలిపింది.

ఈ వెబ్ నార్ లోని వ్యక్తులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి పెట్టడంతో పాటు… ఏ రంగంలో ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించవచ్చునో చూస్తారని తెలిపింది. అంతేకాదు.. మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యతను మెరుగుపరచడం వంటి అనేక విషయాలను ప్యానెలిస్టులు తమ ఆలోచనలను పంచుకుంటారని ప్రధాన మంత్రి కార్యాలయం చెప్పింది.

Also Read:

టూల్ కిట్’ కేసు ప్రకంపనలు : అరెస్ట్‌కు నిరసనగా ప్రదర్శనలు, రైల్ రోకోకు ప్లాన్.! కసబ్ తో పోల్చడంపై గుర్రు, ఎవరీ.. ‘దిశారవి’?

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 28 మంది దుర్మరణం