యూపీలో కూడా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో అనేక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 777 గ్రామాలు వరదల బారినపడ్డాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని యూపీ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అయితే ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. ఇటు వర్షాలు కూడా భారీగా కురుస్తుండటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
777 villages across 16 districts of the state affected due to flood, 520 villages marooned: Uttar Pradesh Chief Minister’s Office (CMO) pic.twitter.com/xw2PiWu3sq
— ANI UP (@ANINewsUP) August 19, 2020
Read More :