Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ సక్సెస్..! ముగ్గురు సైన్యాధిపతులతో రక్షణ మంత్రి భేటీ..

ఈ దాడిలో పాకిస్తాన్ సైనిక స్థావరాలకు ఎలాంటి హాని కలిగించలేదని, పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోలేదని రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. కేవలం ఉగ్రవాద మూలలను మాత్రమే టార్గెట్ చేశామని పేర్కొంది. ఇప్పటికే వాటిని ధ్వంసం చేసే విషయంలో భారతదేశం ఎంతో సంయమనం పాటించింది. పదే పదే పాక్‌ కవ్వింపు చర్యలను తిప్పే కొట్టేందుకు, పహల్గామ్‌లో జరిగిన క్రూరమైన ఉగ్ర దాడి

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ సక్సెస్..! ముగ్గురు సైన్యాధిపతులతో రక్షణ మంత్రి భేటీ..
Operation Sindoor

Updated on: May 07, 2025 | 9:55 AM

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం పాకిస్తాన్, పిఓకెలోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. భారత సైన్యం 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ ఆపరేషన్‌కు సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టింది. రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో కొంతకాలం క్రితం భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించాయని తెలిపింది.

ఈ దాడిలో పాకిస్తాన్ సైనిక స్థావరాలకు ఎలాంటి హాని కలిగించలేదని, పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోలేదని రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. కేవలం ఉగ్రవాద మూలలను మాత్రమే టార్గెట్ చేశామని పేర్కొంది. ఇప్పటికే వాటిని ధ్వంసం చేసే విషయంలో భారతదేశం ఎంతో సంయమనం పాటించింది. పదే పదే పాక్‌ కవ్వింపు చర్యలను తిప్పే కొట్టేందుకు, పహల్గామ్‌లో జరిగిన క్రూరమైన ఉగ్ర దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ జాతీయుడు మరణించిన నేపథ్యంలో ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన తర్వాత రక్షణ మంత్రి ముగ్గురు సైన్యాధిపతులతో చర్చించారు. ఆపరేషన్ సిందూర్ పూర్తయిన తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముగ్గురు సైన్యాధిపతులతో మాట్లాడారు. తదుపరి కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చించినట్టుగా సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us