Omicron: భారత్‌లో ఒమిక్రాన్ తొలి మరణం.. నైజీరియా నుంచి వచ్చాడన్న అధికారులు.. 1200 దాటిన కేసులు..!

|

Dec 31, 2021 | 6:10 AM

దేశంలో ఓమిక్రాన్ రోగుల సంఖ్య శుక్రవారం నాటికి 1,000 మార్కును దాటింది. భారతదేశంలో కేవలం 28 రోజుల్లోనే 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం ఒమిక్రాన్ రోగుల సంఖ్య 1201కి చేరుకుంది.

Omicron: భారత్‌లో ఒమిక్రాన్ తొలి మరణం.. నైజీరియా నుంచి వచ్చాడన్న అధికారులు.. 1200 దాటిన కేసులు..!
Omicron
Follow us on

Omicron Variant: దేశంలో ఓమిక్రాన్ రోగుల సంఖ్య శుక్రవారం నాటికి 1,000 మార్కును దాటింది. భారతదేశంలో కేవలం 28 రోజుల్లోనే 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం ఒమిక్రాన్ రోగుల సంఖ్య 1201కి చేరుకుంది. మహారాష్ట్రలో కొత్త వేరియంట్ కేసులు 450కి చేరుకున్నాయి. ఇది దేశంలోనే అత్యధికం. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 198 మంది రోగులు పాజిటివ్‌గా తేలారు. వార్తా సంస్థ ANI ప్రకారం, ఒమిక్రాన్ నుంచి మొదటి మరణం కూడా మహారాష్ట్రలోనే నమోదైంది.

నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తి మరణించాడు..
దేశంలో ఒమిక్రాన్ నుంచి మొదటి మరణం మహారాష్ట్రలో నమోదైంది. ఇక్కడ 52 ఏళ్ల ఒమిక్రాన్ సోకిన వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. వార్తా సంస్థ ANI ప్రకారం, డిసెంబర్ 28న మరణించాడు. నైజీరియా నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి పింప్రీ చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని యశ్వంత్ చవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను 13 సంవత్సరాలుగా మధుమేహంతో బాధపడుతున్నాడు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కాని కారణాల వల్ల జరిగిన మరణంగా పరిగణించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపిన నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికలో అతనికి ఒమిక్రాన్ ఇన్‌ఫెక్షన్ సోకిందని తేలడం యాదృచ్ఛికమని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ పేర్కొంది.

డిసెంబరు 2న తొలి ఒమిక్రాన్ కేసు..
దేశంలో మొదటి రెండు ఒమిక్రాన్ కేసులు డిసెంబర్ 2న కర్ణాటకలో వెలుగుచూశాయి. డిసెంబర్ 14 నాటికి కేసుల సంఖ్య 50కి పెరిగింది. డిసెంబర్ 17 నాటికి కేసుల సంఖ్య 100కి చేరింది. 200 కేసులు నమోదు కావడానికి 5 రోజులు మాత్రమే పట్టడం గమనార్హం. ప్రస్తుతం ఈ సంఖ్య వెయ్యి దాటింది. అంటే, కేవలం 8 రోజుల్లో ఒమిక్రాన్ సంఖ్య 200 నుంచి 5 రెట్లు వేగంగా పెరిగి వేయి దాటింది. గణాంకాలను చూస్తుంటే, దాని ఇన్ఫెక్షన్ వేగం పెరిగిందని చెప్పవచ్చు.

358 మంది కోలుకున్నారు..
ఇప్పటివరకు దేశంలో 395 ఒమిక్రాన్ బారి నుంచి కోలుకున్నారు. అదే సమయంలో, క్రియాశీల రోగుల సంఖ్య 810గా ఉంది. దేశంలో 263 ఒమిక్రాన్ కేసులతో మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 57 మంది కోలుకున్నారు. 206 మంది ఇంకా చికిత్సలో ఉన్నారు.

అదే సమయంలో, గుజరాత్ 97 కేసులతో దేశంలో మూడవ స్థానంలో ఉంది. ఇక్కడ మొత్తం 97 మంది రోగులు ఉన్నారు. వారిలో 44 మంది కోలుకున్నారు. 53 మంది ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో, రాజస్థాన్ (69), కేరళ (65) కేసులతో వరుసగా నాలుగు, ఐదవ స్థానాల్లో ఉన్నాయి.

8 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ రోగులు లేరు..
దేశంలోని 8 రాష్ట్రాలు ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడలేదు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా 121 దేశాలకు చేరుకుంది. దీని కారణంగా, ఇప్పటివరకు 3.30 లక్షల మందికి పైగా వ్యాధి బారిన పడగా, కొత్త వేరియంట్ కారణంగా 59 మంది మరణించారు. నవంబర్ 25న దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ కేసు గుర్తించారు. దీని తరువాత, డిసెంబర్ 26న, WHO దీనిని ఆందోళనకరంగా మారుతందని ప్రకటించింది. ఆ సమయంలోనే దీనికి ఒమిక్రాన్ అని పేరు పెట్టింది.

Also Read: Omicron Identification: జలుబు.. ఒమిక్రాన్ లక్షణాలు ఒకేవిధంగా ఉంటాయి.. అటువంటప్పుడు కరోనాను గుర్తించడానికి ఏమి చేయాలి?

Coronavirus: కరోనాను ఎదుర్కోవడానికి మరో రెండు వ్యాక్సిన్స్..ఒక యాంటీ వైరల్ డ్రగ్ అందుబాటులోకి..ఇవి ఎలా పనిచేస్తాయంటే..