
ఇప్పుడు యంగిస్థాన్ చుట్టూ చక్కర్లు కొడుతోంది దేశంలో రాజకీయం. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుక, ఢిల్లీని కాక్రోచ్లు వణికిస్తున్న తీరు.. మొత్తం ఎపిసోడ్ని ఓరకంట గమనిస్తూ కౌంటర్ఫైట్కి సిద్ధమవుతోంది మోదీ సర్కార్. కానీ, ఇక్కడే ఇంట్రస్టింగ్ టర్న్ ఏంటంటే, కాక్రోచ్ మూమెంట్ హైజాకై మొత్తం దృశ్యం హస్తం పార్టీ గుప్పిట్లోకి చేరడం. తనదైన సొంత స్టయిల్షీట్తో పార్లమెంటు మన్సూన్ సెషన్స్కి కిక్స్టార్ట్ ఇవ్వబోయారు ప్రధాని మోదీ. ఏరోస్పేస్ ప్రయోగాల్ని విజయవంతం చేసిన స్కైరూట్ అనే స్టార్టప్ కంపెనీ గురించి చెబుతూ, అందులో వర్క్ఫోర్స్ సరాసరి వయసు 28 ఏళ్లేనంటూ.. రాహుల్నుద్దేశించి ఈరకంగా సెటైరేశారు ప్రధాని మోదీ. నేను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్టాడ్డం లేదు అన్నప్పుడు మోదీ మార్క్ ఆఫ్ వ్యంగ్యం అండ్ వెటకారం ఇప్పటికీ సోషల్ మీడియాలో రీసౌండ్ ఇస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో రాబోయే రోజులు ఎంత స్పైసీగా ఉండబోతాయో ఇలా హింట్ ఇచ్చేశారు మోదీ. మీరేమీ తుఫాన్లు సృష్టించడానికి పార్లమెంటుకు రానవసరం లేదని అపోజిషన్కు స్వీట్గా ఓ వార్నింగ్ కూడా జారీ చేశారు. ఆవిధంగా వెదర్ని కూల్కూల్ చేద్దామని మోదీ ఆశిస్తే ఆశించారు గానీ, సభలోపల వెదర్ రిపోర్ట్ మాత్రం వేరేలా ఉంది. హై టెంపరేచర్స్తో రచ్చరచ్చగా మొదలైంది వింటర్...