విషాదం.. ఇంట్లోంచి కవలల్ని ఎత్తుకెళ్లిన వానరం.. ఓ పసికందు మృతి.. మరొకరు…

|

Feb 13, 2021 | 9:44 PM

తమిళనాడు తంజావూర్​లో విషాద ఘటన చోటుచేసుకుంాది.  ఓ కోతి అకస్మాత్తుగా ఇంట్లో ఉన్న కవల పిల్లల్ని ఎత్తుకెళ్లింది. స్థానిక హనుమాన్ టెంపుల్​ దగ్గర్లోని ఓ ఇంటి పైకప్పును పగలగొట్టిన కోతి..

విషాదం.. ఇంట్లోంచి కవలల్ని ఎత్తుకెళ్లిన వానరం.. ఓ పసికందు మృతి.. మరొకరు...
Follow us on

తమిళనాడు తంజావూర్​లో విషాద ఘటన చోటుచేసుకుంది.  ఓ కోతి అకస్మాత్తుగా ఇంట్లో ఉన్న కవల పిల్లల్ని ఎత్తుకెళ్లింది. స్థానిక హనుమాన్ టెంపుల్​ దగ్గర్లోని ఓ ఇంటి పైకప్పును పగలగొట్టిన కోతి.. లోపలకి ప్రవేశించి ఇద్దరు పసికందుల్ని ఎత్తుకెళ్లింది. ఒక చిన్నారిని గ్రామస్థులు కాపాడగా.. మరో చిన్నారి శవం చెరువులో దొరికింది.

అసలేం జరిగిందంటే..?

వివరాల్లోకి వెళ్తే..  తమిళనాడు తంజావూర్ హనుమాన్​ గుడి దగ్గర్లో​ రాజా, భువనేశ్వరి దంపతులు నివాసముంటున్నారు. రాజా పెయింటింగ్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత వారం భువనేశ్వరి కవలలకు జన్మనిచ్చింది. అయితే.. శనివారం (ఫిబ్రవరి 13).. పిల్లల్ని ఇంట్లో ఉంచి భువనేశ్వరి బయట పని చేసుకుంటుంది. ఈ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన ఓ కోతి వచ్చి ఇంటి పైకప్పు పగులగొట్టి.. లోనికి ప్రవేశించింది. మొదట ఓ చిన్నారిని తీసుకెళ్లి గోడపైన ఉంచింది. మళ్లీ వచ్చి రెండో చిన్నారిని తీసుకెళ్తుండగా భువనేశ్వరి చూసి.. గట్టిగా అరిచింది. దీంతో స్థానికులు అక్కడికి చేరుకుని వానరం  దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. హనుమాన్ టెంపుల్ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని.. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Also Read:

Crime News: సోది చెబుతానంటూ వచ్చింది.. ఏకంగా 8 కాసులు బంగారం దోచుకెళ్లింది.. నటకిరీటి ఈ కి’లేడీ’

ఏంటి సామి ఇది.. ఏకంగా షాపు లోడునే అక్రమంగా తరలిస్తున్నారుగా..! అది కూడా కోళ్ల ఎరువు పేరుతో