AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. కుల గణనకు కేంద్రం ఓకే! అసలు మోదీ ప్లాన్‌ ఏంటి?

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, కేంద్ర ప్రభుత్వం కుల ఆధారిత జనాభా గణనను ప్రకటించడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందింది. కాంగ్రెస్, RJD లాంటి ప్రతిపక్షాలు దీనిని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు, ఈ అంశం బీజేపీ చేతుల్లోకి వెళ్ళడం వల్ల ప్రతిపక్షాల వ్యూహం దెబ్బతిన్నట్లు అనిపిస్తోంది.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. కుల గణనకు కేంద్రం ఓకే! అసలు మోదీ ప్లాన్‌ ఏంటి?
Pm Modi, Cm Nitish Kumar
SN Pasha
|

Updated on: Apr 30, 2025 | 7:06 PM

Share

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుల ఆధారిత జనాభా గణనను ఆమోదించడం ద్వారా పెద్ద ట్రంప్ కార్డును వాడింది. కాంగ్రెస్ పార్టీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కుల గణనను నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో బిహార్ రాజకీయాల్లో కాంగ్రెస్ మిత్రపక్షమైన RJD నాయకుడు తేజస్వి యాదవ్ కూడా కుల గణనను డిమాండ్ చేస్తున్నారు. కానీ, మోదీ ప్రభుత్వం కుల గణనను ప్రకటించడం ద్వారా కాంగ్రెస్, RJD నుండి ఈ అంశాన్ని లాక్కున్నట్లు అయింది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కుల గణనకు సంబంధించి తమ వ్యూహాన్ని పునఃపరిశీలించవలసి ఉంటుంది.

గత కొన్ని సంవత్సరాలుగా, రాహుల్ గాంధీ, ప్రతిపక్ష పార్టీలు కుల గణన డిమాండ్ కోసం కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నాయి. రాహుల్ గాంధీ తన ప్రసంగాలలో, ప్రచారాలలో చాలాసార్లు తన ప్రభుత్వం ఏర్పడితే కుల గణన నిర్వహిస్తామని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తి వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం కులగణన చేస్తామని ప్రకటించడంతో ప్రతిపక్షాల వ్యూహాన్ని దెబ్బ కొట్టినట్లు అయింది. ఈ నిర్ణయం బీజేపీకి బీహార్ ఎన్నికలకు ముందు రాజకీయంగా చాలా కీలకంగా మారనుంది. దీని కారణంగా, ఒక ప్రధాన ఎన్నికల అంశం కాంగ్రెస్, ప్రతిపక్షాల చేతుల్లోంచి జారిపోయినట్లే.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటివరకు కుల గణనను వ్యతిరేకించాయని బీజేపీ ఆరోపిస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత జరిగిన అన్ని జనాభా లెక్కల్లో కులాలను లెక్కించలేదని అన్నారు. కులాల సరైన జనాభా గణన నిర్వహించాలనే ఉద్దేశ్యాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ చూపించలేదని, 2010లో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ లోక్‌సభలో కుల గణనను కేబినెట్‌లో పరిశీలిస్తామని చెప్పారని, అయితే దీని తర్వాత ఒక కేబినెట్ గ్రూప్ మాత్రమే ఏర్పడిందని, ఆ కమిటీ సిఫార్సులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కుల డేటాను సేకరించడానికి బదులుగా సామాజిక-ఆర్థిక సర్వే (SECC) మాత్రమే నిర్వహించిందని బీజేపీ ఆరోపించింది. కుల గణనను కాంగ్రెస్ రాజకీయ ఆయుధంగా మాత్రమే ఉపయోగిస్తున్నాయని బీజేపీ చెబుతోంది.

కుల గణన అంటే ఏమిటి?

కుల గణనలో దేశ పౌరుల కులం ఆధారంగా డేటాను సేకరిస్తారు. దీని వలన ఏ కులం, ఏ వర్గాల జనాభా ఇంకా సామాజిక ప్రయోజనాలను పొందలేదో తెలుస్తుంది. ఈ జనాభా గణనను మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. అయితే ఇప్పటివరకు సామాజిక-ఆర్థిక జనాభా గణన మాత్రమే నిర్వహించారు.

Follow Us
గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు APRS CAT 2026 నోటిఫికేషన్ విడుదల
గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు APRS CAT 2026 నోటిఫికేషన్ విడుదల
మీరు బంగారం నాణ్యతను కేవలం ఒక యాప్‌తో తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..
మీరు బంగారం నాణ్యతను కేవలం ఒక యాప్‌తో తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..
రేపే చంద్ర గ్రహణం.. ఏ పదార్థాలపై దర్భ, గరక గడ్డి వేయాలో తెలుసా?
రేపే చంద్ర గ్రహణం.. ఏ పదార్థాలపై దర్భ, గరక గడ్డి వేయాలో తెలుసా?
తలరాత మారుతుంది..మనీ ప్లాంట్‌లో ఈ వస్తువుపెడితే, మీరే కోటీశ్వరులు
తలరాత మారుతుంది..మనీ ప్లాంట్‌లో ఈ వస్తువుపెడితే, మీరే కోటీశ్వరులు
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్.. వర్షం పడితే గెలుపెవరిది?
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్.. వర్షం పడితే గెలుపెవరిది?
ఆ విషయంలో హీరోలంతా ఒకే మాట మీదున్నారుగా
ఆ విషయంలో హీరోలంతా ఒకే మాట మీదున్నారుగా
వేసవిలో కారులో ఏ భాగాలు ఎక్కువగా దెబ్బతింటాయి..?
వేసవిలో కారులో ఏ భాగాలు ఎక్కువగా దెబ్బతింటాయి..?
డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర జీతం!
డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర జీతం!
ఇంగ్లాండ్‌తో సెమీస్ పోరు.. పాక్ రికార్డును మడతెట్టేసిన భారత్
ఇంగ్లాండ్‌తో సెమీస్ పోరు.. పాక్ రికార్డును మడతెట్టేసిన భారత్
మూత్రంలో రక్తం కనిపించడం మూత్రపిండాల క్యాన్సర్‌కు సంకేతమా..?
మూత్రంలో రక్తం కనిపించడం మూత్రపిండాల క్యాన్సర్‌కు సంకేతమా..?