Credit Incentives: ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడానికి 50 వేల కోట్ల రుణ ప్రోత్సాహకాలు ఇచ్చే దిశలో మోడీ ప్రభుత్వం

Credit Incentives: కరోనావైరస్ మహమ్మారి బారిన పడిన దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పెంచడానికి 6.8 బిలియన్ డాలర్ల (50,000 కోట్ల రూపాయలు) రుణ ప్రోత్సాహకాలను అందించడానికి భారతదేశం పరిశీలిస్తోందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

Credit Incentives: ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడానికి 50 వేల కోట్ల రుణ ప్రోత్సాహకాలు ఇచ్చే దిశలో మోడీ ప్రభుత్వం
Credit Incentives

Updated on: Jun 16, 2021 | 6:07 PM

Credit Incentives: కరోనావైరస్ మహమ్మారి బారిన పడిన దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పెంచడానికి 6.8 బిలియన్ డాలర్ల (50,000 కోట్ల రూపాయలు) రుణ ప్రోత్సాహకాలను అందించడానికి భారతదేశం పరిశీలిస్తోందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఆసుపత్రి సామర్థ్యం లేదా వైద్య సామాగ్రిని పెంచడానికి ప్రభుత్వం హామీదారుగా వ్యవహరించేలా ఈ కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు. చిన్న పట్టణాల్లో కోవిడ్ -19 సంబంధిత ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్న నేపధ్యంలో ఈ ప్రతిపాదన తెరమీదకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి సుముఖత చూపలేదు.

ఇటీవలి నెలల్లో భారతదేశంలో వైరస్ విధ్వంసకర వ్యాప్తి దేశం ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలలో ఉన్న లోపాలను బట్టబయలు చేసింది. ఇది ఆసుపత్రి పడకల నుండి ఆక్సిజన్ సరఫరా వరకు అన్నింటికీ కొరతకు దారితీసింది. ఆరోగ్య సంరక్షణ సేవలకు క్రెడిట్ పెంచడానికి, వ్యాక్సిన్ తయారీదారులకు తాజా రుణాలు అందించడానికి గత నెలలో సెంట్రల్ బ్యాంక్ చేసిన ప్రయత్నాలకు ప్రభుత్వ రుణ హామీలు లభించాయి. ఇదేవిధంగా ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల కోసం 500 బిలియన్ రూపాయల విలువైన ఆన్-ట్యాప్ లిక్విడిటీ విండోను ప్రకటించింది.

మహమ్మారి ప్రభావం నుండి వాటిని తగ్గించడానికి 41 బిలియన్ డాలర్ల అత్యవసర రుణ కార్యక్రమంలో విమానయాన సంస్థలు, ఆసుపత్రులతో సహా మరికొన్ని రంగాలను విడిగా ప్రభుత్వం గత నెలలోప్రకటించింది. ఆ కార్యక్రమం ఆస్పత్రులు మరియు క్లినిక్‌లకు 20 మిలియన్ రూపాయల విలువైన రుణాలను ఆన్-సైట్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి హామీ ఇస్తున్నాయి. దీనికి వడ్డీ రేట్లు 7.5% గా నిర్ణయించారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా దేశంలో కరోనా మహమ్మారి దూకుడు తగ్గింది. ఒకప్పుడు భారీగా నమోదైన కేసులు కాస్తా.. 60 వేలకు తగ్గాయి. తాజాగా గత 24 గంటల్లో.. మంగళవారం.. 62,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా నిన్న 2,542 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజగా నమోదైన గణాంకాల ప్రకారం.. మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,33,105 కి చేరగా.. మరణాల సంఖ్య 3,79,573 కి పెరిగింది.

Also Read: కోవిషీల్డ్ డోసుల మధ్య విరామ కాలాన్ని ఎందుకు పెంచామంటే ……కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వివరణ

Taj Mahal Reopens Today: రెండు నెలల తర్వాత తెరుచుకున్న తాజ్ మహల్.. సందర్శకులకు మార్గదర్శకాలు జారీ