శుక్రవారం భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రానున్నారు. ఈరోజు మధ్యాహ్నాం 2 గంటలకు ఆయన చెన్నైకి చేరుకోనున్న జిన్పింగ్. ఆయనకు స్వాగతం పలకనున్న ప్రధాని మోదీ. రెండ్రోజుల శిఖరాగ్ర సమావేశానికి తమిళనాడు తీరప్రాంతం మహాబలిపురం వేదిక కానుంది. ఈ సమావేశంలో ఇరు దేశాలకు చెందిన అగ్రనాయుకులంతా హాజరుకానున్నారు. గతేడాది ఎప్రిల్లో భారత ప్రధాని మోదీ చైనాలో పర్యటించి.. ఇరుదేశాల స్నేహసంబంధాలపై చర్చించారు. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ సమాజంలో భారత్కు పూర్తిగా మద్దతు లభిస్తున్న సమయంలో.. జిన్పింగ్ పర్యటన మరింత కీలకం కానుంది. ఈ పర్యటనలో కాశ్మీర్పై జిన్పింగ్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ.. కాశ్మీర్ అంశం ఇక మాటల్లేవు అని ప్రధాని మోదీ ఇప్పటికే తేల్చిచెప్పారు.
మోదీ, జిన్పింగ్ల భేటీ కోసం మహాబలిపురం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రెండు దేశాల జెండాలు.. ధగధగ మెరిసే కాంతులతో వెలిగిపోతోంది. మరోవైపు.. పోలీసులు.. పూర్తిస్థాయి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోంకుడా ముందుగానే చర్యలు తీసుకుంటున్నారు. లాగే.. ఇరు దేశాల ప్రధానిల భద్రత కోసం.. ముందుగా కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. రెండు రోజులు చైనా ప్రధాని జిన్పింగ్ భారత్లో ఉండనున్నారు. ఈ సమావేశం సందర్భంగా ఇరు దేశాల ప్రధానిలు ఎలాంటి కీలక నిర్ణయాలకు తెరదించనున్నారో.. అనే ఆసక్తి రేకెత్తిస్తోంది.