AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నా ఫ్రెండ్ ని మిస్సయ్యాను’, అరుణ్ జైట్లీకి ప్రధాని మోదీ నివాళి

మాజీ ఆర్ధిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీ తొలి వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ ఘనంగా నివాళి అర్పించారు. నా మిత్రుడ్నికోల్పోయాను అని ట్వీట్ చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు.

'నా ఫ్రెండ్ ని మిస్సయ్యాను', అరుణ్ జైట్లీకి ప్రధాని మోదీ నివాళి
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 24, 2020 | 11:03 AM

Share

మాజీ ఆర్ధిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీ తొలి వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ ఘనంగా నివాళి అర్పించారు. నా మిత్రుడ్నికోల్పోయాను అని ట్వీట్ చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. గత ఏడాది ఇదే రోజున నా సన్నిహిత సహచరుడిని కోల్పోయాను, ఆయన మేధా సంపత్తి, వ్యక్తిత్వ వికాసం మరువలేనివని మోదీ పేర్కొన్నారు. గత ఏడాది ఆయన కన్ను మూసినప్పుడు తుది శ్రధ్ధాంజలి ఘటించలేకపోయానని, అప్పుడు యూఏఈ లో ఉన్నానని ఆయన అన్నారు. అరుణ్ జైట్లీ స్మృత్యర్థం జరిగిన ప్రేయర్ మీటింగ్ లో తాను ఏం మాట్లాడిందీ ఆయన  గుర్తు చేసుకున్నారు. రెండు వారాల అస్వస్థత అనంతరం అరుణ్ జైట్లీ గత ఏడాది ఆగస్టు 24 న ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్ను మూశారు.