చైనాపై ‘సైనిక వ్యూహం’, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్
లడాఖ్ లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా చొరబాటుకు సంబంధించి ఆ దేశంతో సైనిక, దౌత్య స్థాయి చర్చలు విఫలమైన పక్షంలో, ఇండియాకు 'సైనిక వ్యూహం' (మిలిటరీ ఆప్షన్) ఉందని డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. ఉభయ దేశాల..
లడాఖ్ లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా చొరబాటుకు సంబంధించి ఆ దేశంతో సైనిక, దౌత్య స్థాయి చర్చలు విఫలమైన పక్షంలో, ఇండియాకు ‘సైనిక వ్యూహం’ (మిలిటరీ ఆప్షన్) ఉందని డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. ఉభయ దేశాల సైనికాధికారుల మధ్య 5 దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఈ సంవత్సరం ఆరంభంలో లడాఖ్ ప్రాంతంలో చైనా ఏర్పాటు చేసినక్యాంప్ తాలూకు ప్రతిష్టంభన ఇంకా పరిష్కారం కాలేదని ఆయన చెప్పారు. చైనా దళాల చొరబాటును ఎదుర్కొనేందుకు మిలిటరీ వ్యూహం ఉందని, అయితే సైనిక, డిప్లొమాటిక్ చర్చలు విఫలమైన పక్షంలో ఈ వ్యూహాన్ని అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. అయితే ఇది ఎలాంటి వ్యూహమన్నదానిపై వివరించేందుకు ఆయన నిరాకరించారు. ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా లడాఖ్ పరిస్థితిపై సమీక్షించిన సంగతి తెలిసిందే.