భారీ వర్షాలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల వరదల ధాటికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక ఇడుక్కిలో కొండ చరియలు విరిగిపడి.. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా.. ఈ వరదల ధాటికి ఓ పురాతన చర్చి కూలిపోయింది. అలప్పూజా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని చుంగం కురువెళ్లి పదశేఖరం ప్రాంతంలోని 151 ఏళ్ల సెయింట్ పాల్స్ సీఎస్ఐ చర్చ్ కుప్పకూలింది. ఈ సంఘటన మంగళవారం నాడు చోటుచేసుకుంది. భారీ వరదలకు చెరువు గట్టు తెగిపోవడంతో.. పొలాల మధ్య ఉన్న ఈ చర్చ్ కూలిపోయినట్లు స్థానికులు వెల్లడించారు. చర్చ్ సమీపంలో ఉన్న వారిని అధికారులు ముందస్తు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Kerala: 151-year-old St. Paul’s CSI church in Chungam Kuruvelly Padasekharam collapsed today after a bund breached in Alappuzha.
Water entered the church as it was situated in the middle of 2 paddy fields. Locals were shifted as authorities had warned about the breach beforehand pic.twitter.com/amtRlJYY0i
— ANI (@ANI) August 11, 2020
Read More :