Karnataka: హుబ్లీలో వాట్సాప్ స్టేటస్‌పై చెలరేగిన హింస.. 40 మంది అరెస్ట్.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలుః సీఎం

కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోని పాత హుబ్లీ పోలీస్ స్టేషన్‌పై శనివారం రాత్రి గుంపు రాళ్లు రువ్వింది. ఈ రాళ్లదాడిలో 12 మంది పోలీసులు గాయపడ్డారు.

Karnataka: హుబ్లీలో వాట్సాప్ స్టేటస్‌పై చెలరేగిన హింస.. 40 మంది అరెస్ట్.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలుః సీఎం
Karnataka Hubli

Updated on: Apr 17, 2022 | 4:24 PM

WhatsApp Status controversy: కర్ణాటకలో(Karnataka)ని ధార్వాడ్ జిల్లాలోని పాత హుబ్లీ పోలీస్ స్టేషన్‌(Hubli Police Station)పై శనివారం రాత్రి గుంపు రాళ్లు రువ్వింది. ఈ రాళ్లదాడిలో 12 మంది పోలీసులు గాయపడ్డారు. దీంతో పోలీసులు చర్యలు చేపట్టిన పోలీసులు దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు అధికారులు గుంపును చెదరగొట్టడానికి, పోలీసులు లాఠీ ఛార్జ్‌తో పాటు టియర్ గ్యాస్ షెల్‌లను ఆశ్రయించాల్సి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం నగరంలో ఏప్రిల్ 20 వరకు సెక్షన్ 144 (సెక్షన్ 144) అమలులో ఉంది. పోలీసుల సమాచారం ప్రకారం, వాట్సాప్ స్టేటస్‌ను అభ్యంతరకరంగా కలిగి ఉన్న వ్యక్తిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గుంపు పోలీసు స్టేషన్ వెలుపల హింసాత్మక ఘటనకు పాల్పడింది. నిరసనకారులను అదుపు చేసే క్రమంలో వారు పోలీసు స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు.

కాగా, పాత హుబ్లీ పోలీస్ స్టేషన్‌పై మూకుమ్మడి దాడి బహుశా వ్యవస్థీకృత దాడి అని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం అన్నారు. దాడి కోసం పోలీసు స్టేషన్‌లో భారీ సంఖ్యలో గుమిగూడారు. పోలీసులు వాట్సాప్ స్టేటస్ పోస్ట్‌పై చర్య తీసుకున్నారు. అయితే, పాత హుబ్లీలో హింస చెలరేగింది. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ ఘటనను రాజకీయ కోణంలో కాకుండా లా అండ్ ఆర్డర్ కోణంలో చూడాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కోరారు.

ఇలాంటి ఘటనలు నగరంలో శాంతి, సామరస్యాలపై ఆందోళన కలిగిస్తున్నాయని జేడీ(ఎస్) నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. ఈ దాడిపై పోలీసులు దృష్టి సారించాలి. నిరుద్యోగం, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణంపై సోషల్ మీడియా యోధులు మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోంది. హింసకు పాల్పడిన వారిపై ఆరు కేసులు నమోదు చేశామని హుబ్లీ ధార్వాడ్ పోలీస్ కమిషనర్ లాభ్ రామ్ తెలిపారు. పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉంది. పోలీసుల వాహనాలను కూడా ధ్వంసం చేసేందుకు గుంపు ప్రయత్నించింది.

పోలీస్ కమీషనర్ లాభ్ రామ్ మాట్లాడుతూ, ‘ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఒక సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని వాట్సాప్‌లో అభ్యంతరకరమైన పోస్ట్‌ను షేర్ చేయడంతో ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ బాలుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కానీ ఈ చర్యతో సంతృప్తి చెందకపోవడంతో, అర్ధరాత్రి పోలీసు స్టేషన్ వెలుపల పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులు గుమిగూడి రచ్చ సృష్టించడం ప్రారంభించారు. వెంటనే వారు హింసాత్మకంగా మారారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. మరోవైపు, హనుమాన్ జన్మోత్సవంలో ఊరేగింపు జరుగుతుండగా ఈ ఘటన జరిగిందని పోలీసు కమిషనర్ తెలిపారు.

Read Also…  South Africa Floods: దక్షిణాఫ్రికాలో వరదల బీభత్సం.. 400 మంది మృతి.. 40 వేల మంది నిరాశ్రయులు!

 

Loading...
Unable to load recommendations.
Follow Us