AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ సుప్రీంకు చేరిన కన్నడ పాలిటిక్స్

కర్ణాటక రాజకీయంపై కాంగ్రెస్ పార్టీ మళ్లీ సుప్రీం మెట్లెక్కింది. మొన్న 17వ తేదీన సుప్రీం ఉత్తర్వుల్లో విప్‌‌ విషయంపై క్లారిటీ ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ దినేశ్ గుండూరావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు కారణంగా విప్ జారీ చేసే హక్కును కోల్పోయామని కాంగ్రెస్ తన పిటిషన్‌లో పేర్కొంది. విప్ జారీ అనేది రాజకీయ పార్టీకి ఉన్న హక్కు అని.. సుప్రీం కోర్టు తీర్పు 10వ షెడ్యూల్ ఉల్లంఘన కిందకు వస్తుందని […]

మళ్లీ సుప్రీంకు చేరిన కన్నడ పాలిటిక్స్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 19, 2019 | 5:56 PM

Share

కర్ణాటక రాజకీయంపై కాంగ్రెస్ పార్టీ మళ్లీ సుప్రీం మెట్లెక్కింది. మొన్న 17వ తేదీన సుప్రీం ఉత్తర్వుల్లో విప్‌‌ విషయంపై క్లారిటీ ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ దినేశ్ గుండూరావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు కారణంగా విప్ జారీ చేసే హక్కును కోల్పోయామని కాంగ్రెస్ తన పిటిషన్‌లో పేర్కొంది. విప్ జారీ అనేది రాజకీయ పార్టీకి ఉన్న హక్కు అని.. సుప్రీం కోర్టు తీర్పు 10వ షెడ్యూల్ ఉల్లంఘన కిందకు వస్తుందని పిటిషన్‌లో కాంగ్రెస్ నేత దినేష్ పేర్కొన్నారు.