తెలంగాణకి గవర్నర్‌గా వస్తుందనుకున్నాం.. సంజయ్ ఆవేదన

| Edited By:

Aug 07, 2019 | 9:43 AM

బీజేపీ సీనియర్‌ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ మరణ వార్త యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె ఆకస్మిక మృతి పట్ల కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా వస్తుందని ఆశతో ఉన్నామని.. ఇక ఆ ఎదురుచూపులకు భాగ్యం లేకుండా పోయిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సుష్మాజీ చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యానికి గురైన సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి […]

తెలంగాణకి గవర్నర్‌గా వస్తుందనుకున్నాం.. సంజయ్ ఆవేదన
Follow us on

బీజేపీ సీనియర్‌ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ మరణ వార్త యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె ఆకస్మిక మృతి పట్ల కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా వస్తుందని ఆశతో ఉన్నామని.. ఇక ఆ ఎదురుచూపులకు భాగ్యం లేకుండా పోయిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సుష్మాజీ చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు.

గత కొంతకాలంగా అనారోగ్యానికి గురైన సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి కన్నుమూయడంతో… తమ ఆత్మీయురాలిని పోగొట్టుకున్నామన్న బాధ ప్రతి తెలంగాణ పౌరుడు మదిలో ఉందన్నారు. సామాన్య తెలంగాణ పౌరుడి మనోవేదనను ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా మలిచిన ధన్యురాలు సుష్మా స్వరాజ్ అని బండి సంజయ్ పేర్కొన్నారు. తమ ఇంటి ఆడపడుచు మరణం తీరనిదంటూ బాధపడ్డారు. ఆమె అనుసరించిన సైద్ధాంతిక ఆలోచనా ధోరణిలో తెలంగాణ ప్రజలు పయనించడమే ఆమెకు తెలంగాణ ప్రజలు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు.