జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఎదురుకాల్పుల్లో JJMP అధినేత తోసహా నక్సల్స్ హతం..!

జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో జార్ఖండ్ జన ముక్తి పరిషత్‌కు చెందిన ఇద్దరు భయంకరమైన నక్సలైట్లు హతమయ్యారు. రూ. 10 లక్షల రివార్డుతో ఉన్న నక్సలైట్ పప్పు లోహారా, రూ. 5 లక్షల రివార్డుతో ఉన్న నక్సలైట్ ప్రభాత్ గంఝూ హతమయ్యారు. ఈ ఇద్దరు నక్సలైట్లు జార్ఖండ్ జన ముక్తి పరిషత్ అనే సంస్థలో సభ్యులుగా ఉన్నారు.

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఎదురుకాల్పుల్లో JJMP అధినేత తోసహా నక్సల్స్ హతం..!
Jharkhand Encounter

Updated on: May 24, 2025 | 11:27 AM

జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో జార్ఖండ్ జన ముక్తి పరిషత్‌కు చెందిన ఇద్దరు భయంకరమైన నక్సలైట్లు హతమయ్యారు. వారిలో ఒకరికి రూ.10 లక్షలు, మరొకరికి రూ.5 లక్షల రివార్డు ప్రకటించారు. అలాగే, గాయపడిన ఒక కేడర్‌ను భద్రతా దళాలు సజీవంగా పట్టుకున్నారు. వారి నుండి ఒక INSAS రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు.

ఎన్‌కౌంటర్‌లో JJMP అధినేత పప్పు లోహారా ప్రాణాలు కోల్పోయారు. లోహారాపై ప్రభుత్వం రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. కాగా, ప్రభాత్ గంఝూపై రూ.5 లక్షల రివార్డు ఉంది. పప్పు లోహార్ తన సంస్థ సభ్యులతో కలిసి లతేహార్ జిల్లాలోని ఇచ్చావర్ అడవిలో ఒక భారీ సంఘటనకు ప్రణాళిక వేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ తరువాత పోలీసు అధికారులు, భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.

సెర్చ్ ఆపరేషన్ సమయంలో, భద్రతా దళాలను చూసిన వెంటనే ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఆ తర్వాత భద్రతా దళాలు కూడా ప్రతీకారం తీర్చుకున్నాయి. పోలీసుల ప్రతీకార చర్యలో JJMP అధినేత పప్పు లోహారాతో సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. లతేహార్ ఎస్పీ కుమార్ గౌరవ్ నాయకత్వంలో పోలీసులు ఈ ఆపరేషన్‌లో ఉన్నారు. ఈ ఆపరేషన్‌లో CRPF, జార్ఖండ్ పోలీసు బృందాలు పాల్గొన్నాయి. ఇచ్వార్ అడవిలో పోలీసులు – JJMP మిలిటెంట్ స్క్వాడ్ మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో వాంటెడ్ ఉగ్రవాదులు ఇద్దరూ హతమయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..