జమ్మూలో ఉగ్రవాదుల కుట్ర భగ్నం.. ఉరి సెక్టార్‌లో పాకిస్తాన్ ఉగ్రవాది హతం..!

జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌లో ఆదివారం (మార్చి 15) భారత సైన్యం భారీ విజయాన్ని సాధించింది. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి భద్రతా దళాలు బుఖార్ ప్రాంతంలోకి చొరబడటానికి ప్రయత్నించిన ఒక పాకిస్తానీ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. మార్చి 14-15 మధ్య రాత్రి ఈ ఆపరేషన్ ప్రారంభమైంది.

జమ్మూలో ఉగ్రవాదుల కుట్ర భగ్నం.. ఉరి సెక్టార్‌లో పాకిస్తాన్ ఉగ్రవాది హతం..!
Indian Army Jammu Police Joint Operation

Updated on: Mar 15, 2026 | 11:47 AM

జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌లో ఆదివారం (మార్చి 15) భారత సైన్యం భారీ విజయాన్ని సాధించింది. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి భద్రతా దళాలు బుఖార్ ప్రాంతంలోకి చొరబడటానికి ప్రయత్నించిన ఒక పాకిస్తానీ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. మార్చి 14-15 మధ్య రాత్రి ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్ పోలీసుల నిఘా సమాచారం ఆధారంగా, సైన్యం ఈ చర్య తీసుకుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తుండగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక పాకిస్తానీ ఉగ్రవాది హతమయ్యాడు.

బుఖారా ప్రాంతంలో నిఘా పెంచిన భద్రతా దళాలకు.. ఉగ్రవాదుల ఎదురుపడ్డారు. ఫలితంగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక పాకిస్తాన్ ఉగ్రవాది మరణించాడు. ఉగ్రవాది సరిహద్దు దాటి చొరబడటానికి ప్రయత్నిస్తున్నట్లు భద్రతా సంస్థలు చెబుతున్నాయి. సమీపంలో ఇతర ఉగ్రవాదులు ఎవరూ దాక్కుని లేరని నిర్ధారించుకోవడానికి ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఈ ఆపరేషన్ సరిహద్దు గుండా చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ సమీపంలో చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఒక అనుమానిత ఉగ్రవాది మృతి చెందగా, అతని సహచరుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మార్చి 10, మంగళవారం ఈ సంఘటన జరిగిందని సైన్యం తెలిపింది. సరిహద్దు దాటి కొంతమంది ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించవచ్చని భారత సైన్యానికి నిఘా సమాచారం అందింది. దీని తర్వాత, సైన్యం ఆ ప్రాంతంలో నిఘా, సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేసింది. జమ్మూకు చెందిన రక్షణ ప్రతినిధి మాట్లాడుతూ, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఝంగర్ సమీపంలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు కనిపించారని చెప్పారు. ఈ ప్రాంతం నౌషెరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖకు దగ్గరగా ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యారని తెలిపారు.

భద్రతా దళాలు వారిని ఆపడానికి ప్రయత్నించాయి. దీంతో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఆపరేషన్ సమయంలో ఒక అనుమానిత ఉగ్రవాది మృతి చెందాడు. రెండవ ఉగ్రవాదిని గుర్తించడానికి ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇతర చొరబాటుదారులు ఎవరూ దాక్కున్నారని నిర్ధారించుకోవడానికి భద్రతా దళాలు ఆ ప్రాంతమంతా సోదాలు నిర్వహిస్తున్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us