
ఇజ్రాయెల్ జరిపిన విధ్వంసకర దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో రాజుకున్న అగ్నిజ్వాలలు.. పాకిస్తాన్ను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇరాన్పై దాడి తరహాలో తమపై కూడా జరుగుతుందేమోనన్న ఊహాగానాలు పాక్ను కునుకు పట్టనీవ్వడం లేదు. ఆపరేషన్ సింధూర్ 2.0 పేరుతో తమ అణు కేంద్రాలపై దాడి జరుగుతుందేమోనన్న భయం పాకిస్తాన్ను పట్టి పీడిస్తోంది. అసలు పాక్కు భయానికి కారణం ఏంటి..? భారత్ ఇజ్రాయెల్ కలిసి పాక్పై దాడికి ప్లాన్ చేస్తున్నాయా..? ఇరాన్లో జరిగిన విధ్వంసకర దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పాకిస్తాన్ను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన తరహా దాడి పాకిస్తాన్పై కూడా జరుగుతుందనే ఊహాగానాలు అక్కడ జోరందుకున్నాయి. ఆపరేషన్ సిందూర్ 2.0″ పేరుతో పాకిస్తాన్పై దాడి చేసే అవకాశం ఉందంటూ ఆ దేశ సోషల్ మీడియా, వార్తాపత్రికలు, టీవీ ఛానెళ్లలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కు భారతదేశం ఇచ్చిన సందేశం కేవలం ప్రారంభం మాత్రమే. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. అయితే, మిషన్ ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని భారత సైన్యం తెలిపింది. దీని వల్ల పాకిస్తాన్ పై పొంచి ఉన్న ప్రమాదం ఇంకా తప్పలేదని స్పష్టమవుతోంది. దీని కారణంగా ఇజ్రాయెల్ ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసినట్లు భారత్ కూడా పాక్ అణు స్థావరాలపై దాడి చేసే అవకాశం ఉందని పాక్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ కు...