India Covid-19: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా యాక్టివ్ కేసులు.. నిన్న ఎన్ని కేసులంటే..?

|

Apr 10, 2022 | 10:00 AM

India Coronavirus Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. కోవిడ్ థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పతనమైంది. ఇటీవల కాలంలో ప్రతిరోజూ

India Covid-19: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా యాక్టివ్ కేసులు.. నిన్న ఎన్ని కేసులంటే..?
Coronavirus In India
Follow us on

India Coronavirus Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. కోవిడ్ థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పతనమైంది. ఇటీవల కాలంలో ప్రతిరోజూ వేయికి దిగువగానే కేసుల సంఖ్య నమోదవుతుండగా.. శుక్రవారం, శనివారం కేసులు వేయిదాటి నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో (శనివారం) దేశవ్యాప్తంగా 1,154 కరోనా కేసులు (Corona) నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం 11,132 (0.03%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,30,35,371 కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,21,685 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 1258 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,25,02,454 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.76 శాతం ఉంది.

ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,85.70 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా నిన్న 4,18,345 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు 79.38 కోట్ల పరీక్షలు చేసినట్లు వైద్యశాఖ వెల్లడించింది.

Also Read:

Viral Video: పులితోనే ఆటాలా..? దాగుడు మూతలు ఆటాడిన బాతుకు షాకిచ్చిన స్మార్ట్ టైగర్.. వీడియో

Horse in Train: లోకల్ రైలులో గుర్రంతో ప్రయాణం.. ఆర్పీఎఫ్ సిబ్బందికి చుక్కలు.. చివరికి ఏం జరిగిందంటే?