Weather: కూల్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ.. ముగిసిన హీట్‌వేవ్.. ఇకపై వర్షాలే

దేశ ప్రజలకు ఐఎండీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. భానుడి భగ భగలతో మండిపోతున్న జనానికి చల్లటి కబురు చెప్పింది. ఇక నుంచి వెడి గాలులు తగ్గి వాతావరణం కూల్‌ అవుతుందని ప్రకటించింది. నార్త్‌లో ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షాలు పడుతాయని, ఆరేంజ్‌ అలర్ట్‌ కూడా ఇచ్చింది.

Weather: కూల్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ.. ముగిసిన హీట్‌వేవ్.. ఇకపై వర్షాలే
Weather Report

Updated on: May 24, 2023 | 9:55 PM

ఈ ఏడాది ఎండలు కొత్త రికార్డులను సృష్టించాయి. ఎండలతో జనం మాడా పగిలి పోయింది. ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు అని ఎదురు చూస్తున్న జనానికి చల్లటి కబురు అందించింది భారత వాతావరణ శాఖ. ఇక ఎండల వేడిమి తగ్గుతుందని ప్రకటించింది. బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి.. ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని తెలిపింది. దేశంలో హీట్​ వేవ్​ ముగిసిందని వెల్లడించింది.

అటు.. పలు రాష్ట్రాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షాలు కురిసే ప్రమాదం ఉందని తెలిపింది. పలు రాష్ట్రాలకు ఆరేంజ్‌ అలర్ట్‌ జారీ చేసిది. రాజాస్తాన్‌, పంజాబ్‌, ఢిల్లీ, యూపీ, హర్యానా, చంఢీఘడ్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య ప్రాంతాల్లో కూడా బలమైన ఈదురు గాలులకు అవకాశం ఉంది.  మే25, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో అడపా దడపా వానలు కురుస్తూనే ఉన్నాయి. బుధవారం విశాఖ, మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడింది. ఇటు తెలంగాణలో సైతం పలు చోట్ల వర్షం వర్షం పడింది. హైదరాబాద్‌లో బుదవారం మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతం అయి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us