Viral News: ఫస్ట్ శాలరీ ఎంతో చెప్పిన ఐఏఎస్.. ఒక ఆటాడుకుంటున్న నెటిజన్లు.. విషయం ఏంటంటే

|

Sep 27, 2022 | 7:45 PM

పరీక్షకు సిద్ధం కావాలంటే 15 నుంచి 16 గంటల పాటు చదువుకోవాల్సి వచ్చింది. దీంతో పరీక్ష రోజు 102 డిగ్రీల జ్వరం వచ్చిందని చెప్పారు ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్.. ఇంకా తన మొదటి జీతం గురించి చెబుతూ..

Viral News: ఫస్ట్ శాలరీ ఎంతో చెప్పిన ఐఏఎస్.. ఒక ఆటాడుకుంటున్న నెటిజన్లు.. విషయం ఏంటంటే
Ias Awanish Sharan
Follow us on

ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ప్రతిరోజూ తన సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ఎప్పుడూ చర్చల్లో నిలుస్తుంటారు.. ఈసారి ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ను ట్వీట్ చేస్తూ తన మొదటి జీతం గురించి చెప్పాడు. ఈ పోస్ట్‌లో.. అతను తన గురించి చెప్పడమే కాకుండా ప్రజలను కూడా అడుగుతున్నాడు.. ఈ ఐఏఎస్‌ అధికారి పోస్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అవనీష్‌ శరణ్ 2008 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. యూపీఎస్సీ పరీక్షలో 77వ ర్యాంకు సాధించాడు. ఐఏఎస్ అధికారి అవనీష్‌ శరణ్ తన మొదటి జీతం 15,000 అని తన ట్వీట్‌లో రాశారు. అప్పటికి అతని వయస్సు 27 సంవత్సరాలు. అతను ఆఫీసర్ ట్రైనీ- ఐఏఎస్ గా ఈ జీతం పొందాడు. ఈ ట్వీట్‌లో మరీ మీ జీతం అంటూ..నెటిజన్లకు కూడా ప్రశ్నవేశారు.

ఐఏఎస్ అవనీష్ శరణ్ ట్వీట్…
IAS అవనీష్‌ శరణ్ చేసిన ఈ ట్వీట్ తరువాత.. ప్రజల నుండి ఆసక్తికరమైన కామెంట్స్‌ రావడం ప్రారంభించాయి. కొంతమంది తమ మొదటి జీతం గురించి, మరికొందరు ఐఏఎస్ అధికారులను ప్రస్తుత జీతం గురించి కూడా అడుగుతున్నారు. అవనీష్ శరణ్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలకు సమాధానమిస్తున్నాడు. అదే సమయంలో.. ఒక వ్యక్తి మొదటి వేతనం గంటకు రూ.10 అని కామెంట్ బాక్స్‌లో రాశాడు.

ఇకపోతే, ఐఏఎస్ అధికారి అవనీష్‌ శరణ్ ఇటీవల తన 10వ 12వ తరగతి, గ్రాడ్యుయేషన్ మార్కుషీట్‌లను పంచుకున్నారు. 10వ తరగతిలో 44.7 శాతం మార్కులు సాధించాడు. అదే సమయంలో 12వ స్థానంలో 65 శాతం ఫలితాలు వచ్చాయి. ఇది కాకుండా గ్రాడ్యుయేషన్‌లో 60 శాతం ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపరేషన్ సమయంలో తాను 10 సార్లు ప్రిలిమినరీ పరీక్షలో ఫెయిలయ్యానని ఐఏఎస్ అవనీష్ చెప్పారు. అదే సమయంలో (UPSC) ప్రిపరేషన్‌లో, మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూకి చేరుకుంది. రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు. యూపీఎస్సీ సీఎస్ఈ పరీక్షలో 77వ ర్యాంకు సాధించాడు.

ఇవి కూడా చదవండి

యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షకు 10 రోజుల ముందు తాను ఏం చేశానో కొద్ది రోజుల క్రితం ఐఏఎస్ అవనీష్ శరణ్ చెప్పాడు. పరీక్షకు సిద్ధం కావాలంటే 15 నుంచి 16 గంటల పాటు చదువుకోవాల్సి వచ్చింది. దీంతో పరీక్ష రోజు 102 డిగ్రీల జ్వరం వచ్చిందని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి