Surakshabandhan: సురక్ష బంధన్‌కు విశేష స్పందన.. టీవీ 9 ఆధ్వర్యంలో ట్రక్ డ్రైవర్లకు ఉచిత వ్యాక్సిన్

|

Aug 06, 2021 | 2:07 PM

Surakshabandhan: కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. రోజువారీ సామాగ్రీని సరఫరా చేయడంలో ట్రక్‌ డ్రైవర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు..

Surakshabandhan: సురక్ష బంధన్‌కు విశేష స్పందన.. టీవీ 9 ఆధ్వర్యంలో ట్రక్ డ్రైవర్లకు ఉచిత వ్యాక్సిన్
Follow us on

Surakshabandhan: కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. రోజువారీ సామాగ్రీని సరఫరా చేయడంలో ట్రక్‌ డ్రైవర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల బాగోగుల కోసం ఎంతగానో శ్రమించారు. అయితే వారందరికి కూడా టీకాలు వేయడం కూడా ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో వారు కుటంబ సభ్యులను సైతం వదిలి పెట్టే ధైర్యంగా రవాణా సౌకర్యాలలో నిమగ్నం అయ్యారు. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పని చేస్తున్నప్పటికీ కోవిడ్‌ సంక్షోభం సమయంలో ఆక్సిజన్‌, ఔషధ సామాగ్రిని తరలించడంలో వారి సహకారం ఎంతగానో అందింది. కరోనా సెకండ్‌వేవ్‌లో కూడా మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా, లాక్‌డౌన్‌లో అవసరమైన వస్తువులను సరఫరా చేయడంలో నిమగ్నం అయ్యారు. దేశానికి వారి నిస్వార్థ సేవలను గుర్తించి గల్ఫ్ ఆయిల్‌ లూబ్రికెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌, టీవీ9 నెట్‌వర్క్‌, బిగ్‌ ఎఫ్‌ఎమ్‌ భాగస్వామ్యంతో సురక్ష రవాణా ప్రచారంలో భాగంగా కీలక రవాణా కేంద్రాలలో ట్రక్ డ్రైవర్లకు టీకాలు వేయడానికి నోబుల్ డ్రైవ్ చేపట్టింది. ఈ నేపథ్యంలో సురక్ష బంధన్ సీజన్ -3లో భాగంగా ఆగస్టు 6 నుంచి ఆగస్టు 22 వరకు 11 నగరాల్లోని 12 ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లలో 10000 ట్రక్ డ్రైవర్లకు టీకాలు వేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈరోజు TV9 భారత్‌వర్ష్ ఇండోర్, అహ్మదాబాద్, నవీ ముంబైలలో టీకా శిబిరాలను ప్రారంభించింది. ఈ శిబిరాలకు విశేష స్పందన వస్తోంది.

 

ఇవీ కూడా చదవండి:

Covid-19 Vaccine: వ్యాక్సిన్ తీసుకోకుండా ఆఫీస్‌కు వచ్చారు.. అది తెలిసి యాజమాన్యం ఏం చేసిందంటే..?

India Coronavirus: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. గత 24గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?