మూజువాణీ ఓటింగ్ తోనే వచ్చింది చిక్కు !

| Edited By: Anil kumar poka

Sep 21, 2020 | 10:32 AM

రాజ్యసభలో ఆదివారం   రైతు బిల్లులపై విపక్ష సభ్యుల రగడతో ప్రభుత్వం ఏడుగురు ఎంపీలను సస్పెండ్ చేసింది. వీరిలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ ఒకరు.

మూజువాణీ ఓటింగ్ తోనే వచ్చింది చిక్కు !
Follow us on

రాజ్యసభలో ఆదివారం   రైతు బిల్లులపై విపక్ష సభ్యుల రగడతో ప్రభుత్వం ఏడుగురు ఎంపీలను సస్పెండ్ చేసింది. వీరిలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ ఒకరు. ఆయన ఏకంగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ స్థానం వద్దకే దూసుకువెళ్లి ఈ బిల్లుల తాలూకు రూల్ బుక్ ని చించి పోగులు పెట్టారు. ఆప్ కు చెందిన సంజయ్ సింగ్, కాంగ్రెస్ సభ్యుడు రాజీవ్ శాతక్ మైకులను లాగి పారేశారు. ఈ బిల్లులపై ఫిజికల్ ఓటింగ్ జరగాలని ప్రతిపక్షాలు కోరినప్పటికీ డిప్యూటీ చైర్మన్ నిరాకరించి మూజువాణీ ఓటుకు ఆదేశించడంతో గలాభా మొదలైంది. క హరివంశ్ సింగ్ పై సుమారు 50 మంది సభ్యులు  అవిశ్వాస తీర్మానం పెట్టారు. కాగా ఈ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం ఆయన  వద్దకు వెళ్లనున్నాయి.