సుష్మా మృతి పట్ల సంతాపం తెలిపిన విదేశీ నాయకులు

| Edited By: Pardhasaradhi Peri

Aug 07, 2019 | 9:51 AM

బీజేపీ సీనియర్‌ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ మరణ వార్త యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె ఆకస్మిక మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలియజేశారు. అంతే కాదు.. పలువురు విదేశీ నాయకులు కూడా ఆమె అకాల మరణంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. గతంలో విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో.. విదేశాల్లో పర్యటించిన ఆమె.. […]

సుష్మా మృతి పట్ల సంతాపం తెలిపిన విదేశీ నాయకులు
Follow us on

బీజేపీ సీనియర్‌ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ మరణ వార్త యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె ఆకస్మిక మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలియజేశారు. అంతే కాదు.. పలువురు విదేశీ నాయకులు కూడా ఆమె అకాల మరణంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. గతంలో విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో.. విదేశాల్లో పర్యటించిన ఆమె.. స్నేహపూర్వకంగా కలిసిన తీరును గుర్తుచేసుకుంటూ.. సుష్మా మృతి పట్ల సంతాపం తెలిపారు.

ఓ మంచి దౌత్యవేత్తనే కాదు.. మంచి స్నేహితురాలిని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాల్దివుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్.

భారత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మరణ వార్త కలచివేసిందంటూ ఆఫ్ఘనిస్తాన్ విదేశంగ మంత్రి ఎస్ రబ్బాని పేర్కొన్నారు. భారత ప్రజలు ఓ ధృడమైన నాయకురాలిని కోల్పోయారని.. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

సోదరి సుష్మా స్వరాజ్ మృతి విషయం కలిచివేసిందన్నారు ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్. భారత ప్రజలు ఓ మహోన్నత నాయకురాలిని కోల్పోయారని.. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నానన్నారు.