మనదేశం సంపదలో భారీ పెరుగుదల.. ఫోర్బ్స్ జాబితాలో అత్యంత సంపన్న భారతీయ మహిళ ఎవరో తెలుసా

|

Apr 04, 2024 | 10:51 AM

ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం.. అన్నింటా సగం అంటూ భారతీయ మహిళలు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా విశేషమైన పురోగతిని సాధిస్తున్నారు. దేశంలోని అత్యంత సంపన్నుల మధ్య తమ కంటూ స్థానాన్ని పొందేందుకు అనేకమంది ర్యాంకులు అధిరోహించారు. ఈ సంవత్సరం భారతదేశం సంపదలో గణనీయమైన పెరుగుదలను చూసింది. 200 మంది భారతీయులు ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించారు. 2023లో 169 మంది ఉండగా తాజాగా ఈ జాబితాలో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది.

మనదేశం సంపదలో భారీ పెరుగుదల.. ఫోర్బ్స్ జాబితాలో అత్యంత సంపన్న భారతీయ మహిళ ఎవరో తెలుసా
Forbes Richest Indians
Follow us on

కాలంతో వచ్చిన మార్పుల్లో భాగంగా మానవజీవితంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. నేటి సమాజంలో స్త్రీ పురుష బేధం లేకుండా తమని తాము నిరూపించుకుంటూ చరిత్రలో పేజీలు లిఖించుకుంటున్నారు. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం.. అన్నింటా సగం అంటూ భారతీయ మహిళలు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా విశేషమైన పురోగతిని సాధిస్తున్నారు. దేశంలోని అత్యంత సంపన్నుల మధ్య తమ కంటూ స్థానాన్ని పొందేందుకు అనేకమంది ర్యాంకులు అధిరోహించారు. ఈ సంవత్సరం భారతదేశం సంపదలో గణనీయమైన పెరుగుదలను చూసింది. 200 మంది భారతీయులు ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించారు. 2023లో 169 మంది ఉండగా తాజాగా ఈ జాబితాలో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. ఈ వ్యక్తుల ఉమ్మడి సంపద రికార్డు స్థాయిలో $954 బిలియన్లకు పెరిగింది. ఇది 41% పెరుగుదలను సూచిస్తుంది.

భారతదేశ మహిళా బిలియనీర్లు.. నికర విలువ

సావిత్రి జిందాల్, నికర విలువ – $35.5 బిలియన్లు..

జిందాల్ కుటుంబానికి చెందిన సావిత్రి జిందాల్ $35.5 బిలియన్ల నికర విలువతో అగ్రస్థానంలో ఉన్నారు.  ఆమె భారతీయ సంపన్న మహిళగా నిలిచారు. ఆమె జిందాల్ గ్రూప్‌కు చైర్‌పర్సన్. స్టీల్, పవర్, సిమెంట్ , మౌలిక సదుపాయాల కల్పనలను పర్యవేక్షిస్తారు.

రేఖా ఝున్‌జున్‌వాలా, నికర విలువ – $8.5 బిలియన్లు

భారతదేశానికి చెందిన వారెన్ బఫెట్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య అయిన రేఖా ఝున్‌ఝున్‌వాలా.  పెట్టుబడి చతురతకు ప్రసిద్ధి చెందిన తన భర్త నుంచి విలువైన స్టాక్ పోర్ట్‌ఫోలియోను వారసత్వంగా పొందింది.

వినోద్ రాయ్ గుప్తా, నికర విలువ – $5 బిలియన్లు

వినోద్ రాయ్ గుప్తా ఎలక్ట్రికల్,  గృహోపకరణాలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ కంపెనీ హావెల్స్ ఇండియాలో తన హోల్డింగ్స్ ద్వారా విజయాన్ని పొందారు. Ms గుప్తా మార్గదర్శకత్వంలో హావెల్స్ ఇండియా లైటింగ్ ఫిక్చర్‌లు, ఫ్యాన్‌లు, రిఫ్రిజిరేటర్‌లు , వాషింగ్ మెషీన్‌లతో సహా అనేక రకాల ఉత్పత్తులను ఉత్పత్తి చేసే ప్రసిద్ధ బ్రాండ్‌గా ఎదిగింది.

రేణుకా జగ్తియాని, నికర విలువ – $4.8 బిలియన్లు

రేణుకా జగ్తియాని.. మే 2023లో మరణించిన ఆమె భర్త మిక్కీ జగ్తియాని దుబాయ్‌లో స్థాపించబడిన బహుళజాతి వినియోగదారుల సమ్మేళనం అయిన ల్యాండ్‌మార్క్ గ్రూప్ చైర్‌పర్సన్ మరియు CEO. ల్యాండ్‌మార్క్ గ్రూప్ ఆమె మార్గదర్శకత్వంలో 50,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..