ఆస్పత్రి బిల్లు చెల్లించలేదని.. తాళ్లతో కాళ్ళు, చేతులు కట్టేశారు..

| Edited By: Pardhasaradhi Peri

Jun 07, 2020 | 2:13 PM

మధ్యప్రదేశ్ లో ఇదో షాకింగ్ న్యూస్.. అక్కడి షాజాపూర్ జిల్లాలోని ఆసుపత్రి సిబ్బంది బిల్లు చెల్లించలేదని ఓ వృధ్ధుని కాళ్ళు, చేతులను బెడ్ కి కట్టేశారు. ఈ అమానుషం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి వెళ్లగా...

ఆస్పత్రి బిల్లు చెల్లించలేదని.. తాళ్లతో కాళ్ళు, చేతులు కట్టేశారు..
Follow us on

మధ్యప్రదేశ్ లో ఇదో షాకింగ్ న్యూస్.. అక్కడి షాజాపూర్ జిల్లాలోని ఆసుపత్రి సిబ్బంది బిల్లు చెల్లించలేదని ఓ వృధ్ధుని కాళ్ళు, చేతులను బెడ్ కి కట్టేశారు. ఈ అమానుషం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి వెళ్లగా ఆ ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ వృధ్ధుని చికిత్సకు పదకొండు వేల  రూపాయలు అయిందని, కానీ ఈ మొత్తం చెల్లించలేకపోవడం వల్ల సిబ్బంది ఇలా చేశారని తెలిసింది. కానీ ఆయన కుటుంబ సభ్యులు మాత్రం తాము ఇతని అడ్మిషన్ సమయంలో ఆసుపత్రికి అయిదు వేల రూపాయలు చెల్లించామని, కానీ చికిత్సకు కొన్ని రోజులు పట్టడంతో డబ్బులేక మిగతా మొత్తాన్ని చెల్లించలేకపోయామని చెబుతున్నారు. ఆటు హాస్పిటల్ యాజమాన్యం వివరిస్తున్న  కారణం మరోలా ఉంది. ఈ వృధ్ధుని బ్రెయిన్ డిజాస్టర్ కారణంగా తనను తాను గాయపరచుకునేంత స్థితికి చేరుకున్నాడని, అందుకే ఇలా చేశామని వారు స్పష్టం చేశారు. . మానవతా దృక్పథంతో ఇతని బిల్లు మాఫీ చేశామన్నారు. ఏమైనా.. ఇతడ్ని ఎంతకాలం ఇలా పడకకు కట్టివేస్తారో తెలియకుండా ఉంది.