Earthquake: చెన్నై నగరంలో భూ ప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం.. రిక్టరు స్కేలుపై తీవ్రత ఎంతంటే..

భూమి కదిలిపోతున్న ఫీలింగ్‌తో.. స్థానికులంతా భయాందోళన చెందారు. ఇళ్లలోని పాత్రలన్నీ షేకవుతుండటంతో.. ఏం జరుగుతుందో అర్థంకాక బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలు నమోదయ్యాయి.

Earthquake: చెన్నై నగరంలో భూ ప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం.. రిక్టరు స్కేలుపై తీవ్రత ఎంతంటే..
Earthquake In Chennai

Updated on: Feb 22, 2023 | 1:49 PM

చెన్నై నగరం భూ ప్రకంపనలతో ఉలిక్కిపడింది. భూమి కదిలిపోతున్న ఫీలింగ్‌తో.. స్థానికులంతా భయాందోళన చెందారు. ఇళ్లలోని పాత్రలన్నీ షేకవుతుండటంతో.. ఏం జరుగుతుందో అర్థంకాక బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రెండు నుంచి మూడు సెకన్లపాటు భూమి కంపించింది. అన్నాసాలైలోని నివాసాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో నివాసితులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. చెన్నైలో ఈరోజు ఉదయం 10.15 గంటలకు అకస్మాత్తుగా భూకంపం సంభవించింది. చెన్నైలోని రాయపేటలోని లాయిడ్స్ రోడ్డు సమీపంలో భూకంపం సంభవించినట్లు సమాచారం. అక్కడి ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులు అపార్ట్ మెంట్ భవనం నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో కాసేపు తోపులాట జరిగింది.

అన్నారోడ్డు సమీపంలోని వైట్స్ రోడ్ ప్రాంతంలో ఈరోజు స్వల్ప భూకంపం సంభవించినట్లు సమాచారం. మూడంతస్తుల భవనంలో ప్రకంపనలు రావడంతో ఉద్యోగులు, సామాన్య ప్రజలు భయంతో బయటకు వచ్చి రోడ్డుపైకి వచ్చారు. కానీ ఆ ప్రాంతం మినహా మరే ఇతర ప్రాంతంలోనూ భూకంపం సంభవించలేదు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు సమీపంలో మెట్రో పనులు జరుగుతున్న కారణంగానే భూకంపం వచ్చిందని ఆరోపించారు.

దీంతో మెట్రో వర్క్ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లగా.. మెట్రో పనుల వల్ల భూకంపం సంభవించలేదని తేలింది. చెన్నై మెట్రో రైలు పనుల వల్ల ఎలాంటి భూకంపం సంభవించలేదని అధికార యంత్రాంగం వివరణ ఇచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Loading...
Unable to load recommendations.
Follow Us