Watch Video: పట్టపగలు నడిరోడ్డుపై ఘోరం.. రూ.3 వేల కోసం కత్తితో పొడిచి దారుణ హత్య!

|

Aug 02, 2023 | 8:17 PM

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగా ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదనే కోసంతో కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటణ బుధవారం (ఆగస్టు 2) చోటుచేసుకుంది. మృతుడిని సంగం విహార్‌కు చెందిన యూసుఫ్ అలీ (21)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన..

Watch Video: పట్టపగలు నడిరోడ్డుపై ఘోరం.. రూ.3 వేల కోసం కత్తితో పొడిచి దారుణ హత్య!
Delhi Murder
Follow us on

ఢిల్లీ, ఆగస్ట్‌ 2: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగా ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదనే కోసంతో కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటణ బుధవారం (ఆగస్టు 2) చోటుచేసుకుంది. మృతుడిని సంగం విహార్‌కు చెందిన యూసుఫ్ అలీ (21)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

టిగ్రీ ప్రాంతంలోని సంగం విహార్‌కు చెందిన యూసఫ్ అలీ అనే వ్యక్తి షారుఖ్ అనే వ్యక్తి వద్ద ఇటీవల రూ.3 వేలు అప్పుగా తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని షారుఖ్ పలుమార్లు యూసఫ్‌ని కోరాడు. 4 రోజుల క్రితం తనకు డబ్బు వెంటనే తిరిగి ఇవ్వాలని యూసఫ్‌ను షారుఖ్‌ బెదిరించాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఓ షాపు వద్ద ఉన్న యూసఫ్‌పై షారుఖ్ కత్తితో దాడి చేశాడు. పలుమార్లు కత్తితో యూసఫ్‌ను పొడిచాడు. దీంతో తీవ్రగాయాలపాలైన యూసఫ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమయంలో అక్కడున్నవారు షారుఖ్‌ను ఆపే ప్రయత్నం చేశారు. ఐతే అప్పటికే యూసఫ్‌ మకణించాడు.

ఇవి కూడా చదవండి

కొందరు నిందితున్ని బంధించి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తన వద్ద యూసఫ్‌ రూ.3 వేలు అప్పుగా తీసుకున్నాడని, డబ్బు చెల్లించకపోవడంతో యూసఫ్‌ను హత్య చేసినట్లు నిందితుడు షారుఖ్‌ నేరం అంగీకరించాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.