First Driverless Train: ప్రయాణికులకు విజ్ఞప్తి….డ్రైవర్ లేని ట్రైన్ రాబోతోంది… ఎక్కడో తెలుసా..?

ప్రయాణికులకు విజ్ఞప్తి ఢిల్లీ నుంచి మెజెంటా వెళ్లే మెట్రో ట్రైన్ మరికొద్ది నిమిషాల్లో ప్లాట్ ఫాం మీదకు రానుంది. అయితే ఈ రైలుకు ఓ ప్రత్యేకత ఉంది.

First Driverless Train: ప్రయాణికులకు విజ్ఞప్తి....డ్రైవర్ లేని ట్రైన్ రాబోతోంది... ఎక్కడో తెలుసా..?

Updated on: Dec 25, 2020 | 8:48 AM

Delhi Metro : ప్రయాణికులకు విజ్ఞప్తి ఢిల్లీ నుంచి మెజెంటా వెళ్లే మెట్రో ట్రైన్ మరికొద్ది నిమిషాల్లో ప్లాట్ ఫాం మీదకు రానుంది. అయితే ఈ రైలుకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే… ఢిల్లీ మెట్రో డ్రైవర్ లేని ట్రైన్‌ను నడపనుంది. ఈ రైలును భారత ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 28న ప్రారంభించనున్నారు.

 

దేశంలోనే మొదటి డ్రైవర్ లేని రైలు ఢిల్లీ నుంచి మెజెంటా లైన్‌లో నడపనున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఢిల్లీ మెట్రో 18 ఏళ్ల సందర్భంగా ఈ ప్రత్యేక రైలును ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని మెట్రో అధికారులు తెలిపారు. కాగా, ఢిల్లీ మెట్రో డిసెంబర్ 25న, 2002లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోలో ప్రతి రోజు 26 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us