
ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన అమానుష సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉప్రాల్సి గ్రామంలో, ఒక చిన్న వివాదం కారణంగా ఒక యువకుడు వృద్ధ మహిళపై అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ మహిళను స్థానికులు ఆసుపత్రిిక తరలించారు. ఈ భయానక సంఘటన మొత్తం సమీపంలోని సిసిటివి కెమెరాలో రికార్డైంది. ఇది నిందితుడి క్రూరత్వాన్ని స్పష్టంగా చూపిస్తుంది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, పోలీసులు వేగంగా చర్య తీసుకుని ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు.
ఈ మొత్తం సంఘటన ఫిబ్రవరి 4, 2026న గ్రామ పెద్ద రోడ్డు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నప్పుడు జరిగిందని తెలుస్తోంది. స్థానికుల కథనం ప్రకారం, ఈ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒక వైపు నుండి ఒక వృద్ధ మహిళ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించినప్పుడు, అక్కడ ఉన్న వ్యక్తులు అప్పటికే కోపోద్రిక్తులయ్యారు. చేతిలో పారతో నిలబడి ఉన్న బబ్లి అనే యువకుడు ఆ మహిళను చూసి కోపంగా ఊగిపోయాడు. అత్యంత దారుణంగా వృద్దురాలిపై దాడి చేశాడు. ఆమెను పారతో నేలకేసి కొట్టాడు. కింద పడిపోయిన ఆమెను చంపాలని అనుకున్నాడు, కానీ అక్కడ ఉన్న గ్రామస్తులు జోక్యం చేసుకుని ఆమె ప్రాణాలను కాపాడారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ సంఘటన తర్వాత, బాధితురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తల్లిని హత్య చేయాలనే ఉద్దేశ్యంతో దాడి చేశారని ఆరోపించాడు. కొడుకు ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు ఇద్దరు వ్యక్తులపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జార్చా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ, పోలీసులు చర్యలు తీసుకుని ప్రధాన నిందితుడు బాబ్లీని అరెస్టు చేశారని, ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న రెండవ నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. అతని కోసం పోలీసులు గాలింపు నిర్వహిస్తున్నారు. త్వరలో అతన్ని కూడా జైలులో పెట్టనున్నట్లు పేర్కొన్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..