మసాజ్ పార్లర్‌లో పైశాచికత్వం.. పొట్ట కూటి కోసం పనికి పస్తే.. నలువైపులా చెరబట్టి చిదిమేశారు..

| Edited By: Ravi Kiran

Aug 06, 2022 | 3:06 PM

మసాజ్ పార్లర్‌లో పనిచేస్తున్న బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు శనివారం వెల్లడించారు.

మసాజ్ పార్లర్‌లో పైశాచికత్వం.. పొట్ట కూటి కోసం పనికి పస్తే.. నలువైపులా చెరబట్టి చిదిమేశారు..
Delhi Gang Rape
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం ఘటన జరిగింది. మసాజ్ పార్లర్‌లో పనిచేస్తున్న బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. మసాజ్ పార్లర్ మేనేజర్, కస్టమర్‌ బాధిత బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ బాధితురాలు ఆరోపించింది. ఢిల్లీలోని పితంపురాలో ఒక మసాజ్ పార్లర్‌లో పనిచేస్తున్న ఒక అమ్మాయి తనపై ఆగస్టు 5న పార్లర్ మేనేజర్, కస్టమర్ అత్యాచారం చేశాడని ఆరోపించింది. స్పా సెంటర్ యజమాని బ్రిజ్ గోపాల్ (49), సందీప్ (48)లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

మసాజ్ పార్లర్‌లో పనిచేస్తున్న బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు శనివారం వెల్లడించారు. స్పా సెంటర్ యజమాని బ్రిజ్ గోపాల్ (49), సందీప్ (48)లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 354A, 328, 376D కింద కేసు నమోదు చేసి నిందితులు 21 ఏళ్ల రాహుల్, 48 ఏళ్ల సతీష్ కుమార్‌లను అరెస్ట్ చేశారు. దీంతో పాటు ఓషన్ స్పా సెంటర్‌పై ఐపీసీ సెక్షన్ 188సీ కింద కేసు నమోదు చేశారు. స్పా సెంటర్ యజమాని బ్రిజ్ గోపాల్ (49), 48 ఏళ్ల సందీప్‌లను అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి