ములాయం సింగ్ యాదవ్కు అస్వస్థత..ఆసుపత్రిలో చేరిక
ఈ నెల 6న ఆయన అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అన్ని రకాల టెస్టులు చేసిన వైద్యులు చికిత్స చేశారు. అనంతరం శనివారం రోజునే ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశార్చ్ చేశారు.
సమాజ్ వాదీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఐదు రోజుల వ్యవధిలో ఆయన ఆసుపత్రి పాలు కావడం ఇది రెండో సారి. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఆయన అస్వస్థతకు గురి కావడంతో వెంటనే లక్నోలోని వేదాంత ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ప్రస్తుతం ములాయం సింగ్ యాదవ్ వయస్సు 80 సంవత్సరాలు. గతకొద్ది రోజులుగా ఉదరకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 6న ఆయన అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అన్ని రకాల టెస్టులు చేసిన వైద్యులు చికిత్స చేశారు. అనంతరం శనివారం రోజునే ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశార్చ్ చేశారు. ఆదివారం సాయంత్రం తిరిగి అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించారు.