PM Modi: వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించండి.. ఊబకాయంపై ప్రధాని మోదీ ఆందోళన

ఊబకాయం సమస్యపై అంతా దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. అనేక ఆరోగ్య సమస్యలకు ఊబకాయం కారణమవుతోందని తెలిపారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చంటూ పేర్కొన్నారు. దేశంలో తలెత్తుతున్న తీవ్రమైన ఆరోగ్య సమస్య ఊబకాయం (స్థూలకాయం) అని.. దీనిపై ఇప్పటినుంచి అందరూ దృష్టిసారించాలని ప్రధాని మోదీ సూచించారు.

PM Modi: వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించండి.. ఊబకాయంపై ప్రధాని మోదీ ఆందోళన
Pm Narendra Modi

Updated on: Feb 23, 2025 | 3:16 PM

ఊబకాయం సమస్యపై అంతా దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. అనేక ఆరోగ్య సమస్యలకు ఊబకాయం కారణమవుతోందని తెలిపారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చంటూ పేర్కొన్నారు. దేశంలో తలెత్తుతున్న తీవ్రమైన ఆరోగ్య సమస్య ఊబకాయం (స్థూలకాయం) అని.. దీనిపై ఇప్పటినుంచి అందరూ దృష్టిసారించాలని ప్రధాని మోదీ సూచించారు. దీనికోసం ప్రతి నెల వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించాలని.. వంట నూనె కొనుగోలు చేసే సమయంలో 10 శాతం తక్కువగా కొనుగోలు చేయాలని మోదీ సూచించారు. ఆల్ ఇండియా రేడియో నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ (Mann Ki Baat 119th Episode) తాజా ఎపిసోడ్‌లో.. ప్రధాని మోదీ ఊబకాయం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.. ఈ సందర్భంగా ఒక పరిశోధనను ఉదహరించారు.. నేడు ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారని, గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి కేసులు రెట్టింపు అయ్యాయని అన్నారు. “పిల్లలలో ఊబకాయం సమస్య నాలుగు రెట్లు పెరగడం మరింత ఆందోళన కలిగించే విషయం” అని ఆయన అన్నారు. WHO డేటా ప్రకారం, 2022లో, ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారని.. వివరించారు. ఈ క్రమంలో ప్రతి నెలా ఆహారంలో 10 శాతం తక్కువ నూనెను ఉపయోగించాలని సూచించారు. ఇది సవాలుగా తీసుకోవాలని సూచించారు. అలా చేయడం ద్వారా.. వారు మరో 10 మందికి ఇలాంటి సవాలు విసరగలరంటూ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా, బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ సహా మరికొందరు ప్రముఖుల ఆడియో సందేశాలను కూడా ప్రధానమంత్రి వినిపించారు.. ఊబకాయాన్ని తగ్గించడానికి లేదా నివారించడానికి చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరారు.

“ఆహారంలో నూనెను తక్కువగా ఉపయోగించడం.. ఊబకాయంతో పోరాడటం అనేది కేవలం వ్యక్తిగత ఎంపిక మాత్రమే కాదు.. కుటుంబం పట్ల మన బాధ్యత కూడా” అని ప్రధాని మోదీ అన్నారు. ఆహారంలో నూనెను అధికంగా వాడటం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, అధిక ఒత్తిడి వంటి అనేక వ్యాధులు వస్తాయి. మన ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా, మన భవిష్యత్తును బలంగా, ఆరోగ్యంగా, వ్యాధి రహితంగా మార్చుకోవచ్చు… అంటూ మోదీ సూచించారు.

కార్బోహైడ్రేట్ల వాడకాన్ని తగ్గించండి..

దేశంలోని ప్రఖ్యాత డాక్టర్ దేవి శెట్టి మాట్లాడుతూ.. దేశంలోని తీవ్రమైన ఆరోగ్య సమస్యలలో స్థూలకాయం ఒకటి. భారతదేశ యువత కూడా ఇప్పుడు దీనికి బలైపోతున్నారు. దీని వెనుక ప్రధాన కారణం ఒకరి జీవనశైలిలో చెడు ఆహారపు అలవాట్లను చేర్చడమేనని ఆయన అన్నారు. కార్బోహైడ్రేట్లను అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుందని ఆయన అన్నారు.

మీ ఆహారంలో బియ్యం, బ్రెడ్, చక్కెరను అధిక మొత్తంలో తీసుకోవడం.. దీనితో పాటు, ఆహారంలో అధిక నూనె వాడటం వల్ల కూడా ఊబకాయం సమస్య వస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు, బిపి, ఫ్యాటీ లివర్ వంటి తీవ్రమైన వ్యాధులు తలెత్తుతాయి. దీనికోసం, అందరు యువత తమ ఆహారాన్ని నియంత్రించుకోవాలి.. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.. అని సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us