దేశంలో కరోనా విజృంభణ మరింత తీవ్ర రూపం దాల్చింది. లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నప్పటికి కేసుల తీవ్రత తగ్గడం లేదు. ఈ మహ్మమారి వైరస్ వల్ల గడిచిన 24 గంటల్లో మరో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2293 మంది వైరస్ సోకింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది. కాగా మే3 తర్వాత గ్రీన్ జోన్స్ లో భారీ సడలింపులు ఇచ్చింది కేంద్రం. నేడు ప్రధాని మోదీ లాక్ డౌన్ 3.O పై జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
మొత్తం కేసులు : 37336
యాక్టివ్ కేసులు : 26167
మరణాలు : 1218
కోలుకున్నవారు : 9952