Oxygen Shortage: కోవిడ్ సోకిన భర్తను కాపాడుకునేందుకు భార్య ప్రయత్నం.. నోటి ద్వారా శ్వాస.. అయినా దక్కని ప్రాణం..

|

Apr 26, 2021 | 12:16 PM

Coronavirus Patient: దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ లక్షలాది కేసులు వెలుగులోకి వస్తుండగా.. వేలాది మంది మరణిస్తున్నారు. ఈ విపత్కర

Oxygen Shortage: కోవిడ్ సోకిన భర్తను కాపాడుకునేందుకు భార్య ప్రయత్నం.. నోటి ద్వారా శ్వాస.. అయినా దక్కని ప్రాణం..
Coronavirus Patient
Follow us on

Coronavirus Patient: దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ లక్షలాది కేసులు వెలుగులోకి వస్తుండగా.. వేలాది మంది మరణిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. అత్యవసర సమయంలో మెడికల్ ఆక్సిజన్ అందక రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన సంఘటన అందరినీ కలచివేస్తోంది. ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. శ్వాస ఆడక.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్తను కాపాడుకోవడం కోసం.. భార్య తన నోటితో శ్వాస అందిస్తూ బ్రతికించుకునే ప్రయత్నం చేసింది. అయినా.. భర్త ప్రాణం నిలవకపోవడంతో.. ఆ మహిళ గుండెలవిసేలా రోదించింది. ఈ సంఘటన శుక్రవారం జరగ్గా.. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆగ్రాలోని హౌసింగ్ డెవలప్‌మెంట్ సెక్టార్ -7 నివాసి రవి సింఘాల్ (47) కోవిడ్‌తో బాధపడుతున్నాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో అతని భార్య రేణు సింఘాల్ బంధువులతో కలిసి ఆసుపత్రికి ఆటోలో బయలు దేరింది. ముందు రామా హాస్పిటల్ ఆ తర్వాతసాకేత్ హాస్పిటల్, కేజీ నర్సింగ్ హోమ్‌కు వెళ్లినా.. పడకలు అందుబాటులో లేక సింఘాల్‌ను చేర్చుకులేదు. చివరకు రేణు తన భర్తను తీసుకోని ఆటోలో ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి చేరుకుంది. ఈ క్రమంలో ఆక్సిజన్ అందక కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తన భర్తను కాపాడుకునేందుకు తన నోటితో శ్వాస అందించింది. ఎలాగైనా తన భర్త ప్రాణాన్ని దక్కించుకోవాలని పదే పదే నోటితో శ్వాస అందించింది.

Covid 19 Patient

ఈ క్రమంలో రవిని పరీక్షించిన వైద్యులు.. చనిపోయినట్లు తెలిపారు. తన భర్త మరణించాడన్న విషయం తెలిసి రేణు కన్నీరుమున్నీరయ్యింది. గుండెలవిసేలా రోదిస్తూ కుప్పకూలింది. తన భర్తను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయంటూ రోదించింది. ప్రస్తుతం ఈ చిత్రం దేశంలో జరుగుతున్న సంఘటనలకు సక్షాత్కారమిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలాఉంటే.. ఉత్తరప్రదేశ్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఆక్సిజన్ నిల్వలు లేక ఇక్కడ కూడా పలువురు ప్రాణాలు కోల్పోయారు.

Also Read:

Oxygen Concentrators: భారత్‌కు అమెజాన్ సాయం.. సింగపూర్ నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు..

India Covid-19: దేశంలో నిన్న 3.5 లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు.. రికార్డు స్థాయిలో మరణాలు