Corona Virus: కేంద్రం కీలక నిర్ణయం..12 ఏళ్ల పిల్ల‌ల‌కూ వ్యాక్సిన్, 60 ఏళ్ళు పైబడిన వారికీ బూస్టర్ డోస్ ఎప్పటి నుంచి అంటే?

Corona Virus: రెండేళ్ల క్రితం ప్రపంచంలో అడుగు పెట్టిన కోవిడ్ (Covid -19) ను అదుపులోకి తీసుకుని రావడానికి అనేక చర్యలు తీసుకుంది.. ఇప్పటికీ అనేక నిబంధనలు అమలు చేస్తూనే ఉంది. అనేకాదు.. కరోనా వ్యాధి నివారణ కోసం

Corona Virus: కేంద్రం కీలక నిర్ణయం..12 ఏళ్ల పిల్ల‌ల‌కూ వ్యాక్సిన్, 60 ఏళ్ళు పైబడిన వారికీ బూస్టర్ డోస్ ఎప్పటి నుంచి అంటే?

Updated on: Mar 14, 2022 | 4:31 PM

Corona Virus: రెండేళ్ల క్రితం ప్రపంచంలో  అడుగు పెట్టిన కోవిడ్ (Covid -19) ను అదుపులోకి తీసుకుని రావడానికి అనేక చర్యలు తీసుకుంది.. ఇప్పటికీ అనేక నిబంధనలు అమలు చేస్తూనే ఉంది. అనేకాదు.. కరోనా వ్యాధి నివారణ కోసం  మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా విజయవంతంగా నిర్వహిస్తుంది. కరోనా మహమ్మారిని అరికట్టే దిశగా అనేక చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్ప‌టి వరకూ పెద్ద‌ల‌కు మాత్ర‌మే వ్యాక్సిన్ వేసిన ప్ర‌భుత్వం.. ఇటీవ‌లే 15- 18 ఏళ్ల వ‌య‌సు పిల్ల‌లకు కూడా వ్యాక్సిన్ల‌ను వేసింది. తాజాగా 12-14 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు పిల్ల‌ల‌కు కూడా వ్యాక్సినేషన్‌కు కేంద్రం రంగం సిద్ధం చేసింది.

మార్చి 16 నుంచే ఈ వ‌య‌సు పిల్ల‌ల‌కు వ్యాక్సిన్లు వేయ‌నున్న‌ట్లు మార్చి 14న కేంద్రం ప్ర‌క‌టించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల ప్ర‌కారం 12-14 ఏళ్ల మధ్య పిల్లలతో పాటు 60 ఏళ్లకు పైబడిన వాళ్లకు ప్రికాషన్‌ డోసు ప్రక్రియ మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మాన్షుక్‌ మాండవీయా త‌న ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దేశంలో కొన్ని నెల‌లుగా సాగుతున్న‌ వ్యాక్సినేషన్‌లో భాగంగా ఇప్పటి వరకు వంద కోట్ల డోసులకు పైగా వ్యాక్సిన్ వేశారు.

 

 

Also Read: కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ల మూసివేతకు నిరసనగా స్థానికుల సంతకాల ప్రచారం..(ఫొటోస్ )

Digitally for Scrapping: పాత వాహనదారులకు ముఖ్య సూచన.. స్క్రాపేజ్ పాలసీ ముసాయిదాను విడుదల చేసిన కేంద్రం

Loading...
Unable to load recommendations.
Follow Us