Rahul Gandhi: గత మూడేళ్లలో రాహుల్ గాంధీ ఎన్నిసార్లు భద్రతా నియమాలు ఉల్లంఘించారో తెలుసా.. క్లారిటీ ఇచ్చిన CRPF..

|

Dec 29, 2022 | 12:06 PM

భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సరైన భద్రత ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణపై సెంట్రల్‌ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ - సీఆర్పీఎప్‌ స్పష్టత ఇచ్చింది. రాహుల్‌ గాంధీ భద్రత విషయంలో ఎలాంటి లోపం లేదని, భద్రతా నియమాలు, మార్గదర్శకాలను..

Rahul Gandhi: గత మూడేళ్లలో రాహుల్ గాంధీ ఎన్నిసార్లు భద్రతా నియమాలు ఉల్లంఘించారో తెలుసా.. క్లారిటీ ఇచ్చిన CRPF..
Follow us on

భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సరైన భద్రత ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణపై సెంట్రల్‌ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ – సీఆర్పీఎప్‌ స్పష్టత ఇచ్చింది. రాహుల్‌ గాంధీ భద్రత విషయంలో ఎలాంటి లోపం లేదని, భద్రతా నియమాలు, మార్గదర్శకాలను రాహుల్ గాంధీ ఉల్లంఘించారని CRPF తెలిపింది. 2020 నుండి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 113 సార్లు భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించారని, ఈ విషయాన్ని ఆయనకు తెలియజేసినట్లు పేర్కొంది. రాహుల్ గాంధీ నిర్దేశించిన మార్గదర్శకాలను అనేక సందర్భాల్లో ఉల్లంఘించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాటు.. యాత్రలో పాల్గొనేవారికి సరైన భద్రత కల్పించడం లేదని, భద్రతా లోపాలపై చర్యలు తీసుకుని, అవసరమైన సెక్యూరిటీ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు లేఖ రాసింది. ఈ క్రమంలో సీఆర్పీఎఫ్ రాహుల్‌ గాంధీ భద్రతా ఏర్పాట్లపై స్పందించింది.

రాహుల్ గాంధీకి అవసరమైన మేరకు భద్రత కల్పించామని, ఆయన సందర్శనల సమయంలో రాష్ట్ర పోలీసులు, భద్రతా సంస్థల సమన్వయంతో CRPF అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రవేశించినప్పటి నుంచి.. తగినంత సిబ్బందితో భద్రత కల్పించామన్నారు. భద్రతా నియమాలు, మార్గదర్శకాలను పాటించినట్లు తెలిపారు.

2020 నుండి 113 సార్లు నిర్ధేశించిన మార్గదర్శకాలను రాహుల్ గాంధీ ఉల్లంఘించారని సీఆర్పీఎఫ్ తెలిపింది. అలాగే ఢిల్లీలో కూడా రాహుల్ భద్రతా మార్గదర్శకాలను పాటించలేదని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..