అరుణాచల్ ప్రదేశ్ లో చైనా దుశ్చర్య, అయిదుగురి కిడ్నాప్

అరుణాచల్ ప్రదేశ్ లో అయిదుగురిని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసింది. భారత-చైనా సరిహద్దుల్లోని అప్పర్ సుభాన్ సిరి అడవుల్లో వేటకు వెళ్లిన వీరిని చైనా సైనికులు అపహరించుకుని పోయారు. అయితే వీరిలో ఇద్దరు..

అరుణాచల్ ప్రదేశ్ లో చైనా దుశ్చర్య, అయిదుగురి కిడ్నాప్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 05, 2020 | 6:43 PM

అరుణాచల్ ప్రదేశ్ లో అయిదుగురిని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసింది. భారత-చైనా సరిహద్దుల్లోని అప్పర్ సుభాన్ సిరి అడవుల్లో వేటకు వెళ్లిన వీరిని చైనా సైనికులు అపహరించుకుని పోయారు. అయితే వీరిలో ఇద్దరు అతికష్టం మీద తప్పించుకుని తిరిగివఛ్చి పోలీసులకు ఈ సమాచారం తెలిపారు. చైనా సైనికుల చెరలో ఉన్న ముగ్గురి పరిస్థితి ఏమిటో తమకు తెలియదని వీరు చెప్పారు. గత కొన్ని నెలల క్రితం కూడా చైనా పీపుల్స్  లిబరేషన్ ఆర్మీ ఇలాగే కొంతమందిని కిడ్నాప్ చేసిందని, ఇప్పటికైనా ఆ దేశానికి గట్టిగా బుధ్డి చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే నినాంగ్ డిమాండ్ చేశారు. కాగా స్థానిక పోలీసుల సాయంతో భారత సైనికులు చైనావారి చెరలో ఉన్నవారిని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

అసలే లడాఖ్ లో చైనా దళాల చొరబాటుతో ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో  అరుణాచల్ లో జరిగిన ఈ ఘటన తో చైనా పట్ల ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.