Centre Good News To Farmers: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్… ఎరువు ధరలపై కీలక ప్రకటన.. వివరాలు ఇవే…

| Edited By: Team Veegam

Apr 10, 2021 | 12:16 PM

కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు కాస్త ఊరనిచ్చే వార్త చెప్పింది.  యూరియా మినహా ఇతర ఎరువుల ధరలను పెంచొద్దని ఎరువుల కంపెనీలను ఆదేశించింది.

Centre Good News To Farmers: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్... ఎరువు ధరలపై కీలక ప్రకటన.. వివరాలు ఇవే...
Fertilizers Price
Follow us on

కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు కాస్త ఊరనిచ్చే వార్త చెప్పింది.  యూరియా మినహా ఇతర ఎరువుల ధరలను పెంచొద్దని ఎరువుల కంపెనీలను ఆదేశించింది. డీఏపీ సహా ఎంవోపీ, ఎన్‌పీకేలకు ప్రజంట్ ఏ రేట్లు అయితే ఉన్నాయో.. వాటినే కొనసాగించాలని స్పష్టం చేసింది.  ఎరువుల రేట్లు పెంచనున్నట్లు కంపెనీల నుంచి సంకేతాల రావడంతో.. రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకుంది.  దీంతో అలెర్టైన కేంద్ర ప్రభుత్వం గురువారం హై లెవల్ మీటింగ్ నిర్వహించింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ధరల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని ఈ భేటీలో నిర్ణయించారు. వాస్తవానికి పెట్రోలియం ఉత్పత్తులలాగానే… ఎరువుల ధరల్లో కూడా అంతర్జాతీయ మార్కెట్ల పోకడలకు అనుగుణంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. కేంద్రం రైతులకు రాయితీ కల్పిస్తూ.. ఆ డబ్బును ఎరువుల కంపెనీలకు చెల్లిస్తుంది.

”డీఏపీ, ఎంఓపీ, ఎన్‌పీకేలను రైతులు పాత ధరలకే పొందవచ్చు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు.. వారి ప్రయోజనాలే మా ప్రాధాన్యం.  ఎరువుల ధరలు పెరగవని ప్రకటిస్తున్నాం” అని సమావేశం అనంతరం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ట్వీట్‌ చేశారు.

ఖరీఫ్‌ సీజన్‌ స్టార్టింగ్‌కు ముందే డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను పెంచాలని సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు స్థానిక వ్యాపారులకు సమాచారం అందింది. పెంపు సుమారు 58% ఉండటంతో… అన్నింటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అన్నదాతల్లో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్రం.. తాజా ఆదేశాలతో వారికి ఊరట లభించినట్లు అయ్యింది.

Also Read: ఈ రాజు ఏడాదికి ఒక కన్యను పెళ్లి చేసుకుంటాడు.. ఇప్పటికి 15 మంది భార్యలు.. ఇంకా

14 వారాలకే కడుపులో బిడ్డ మృతి.. పసికందు కోసం తల్లడిల్లిన మాతృహృదయం.. చివరకు3

వకీల్‌‌‌‌సాబ్ వసూల్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే…