AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bullet Train: దేశంలో తొలి బుల్లెట్‌ ట్రైన్ స్టేషన్‌.. వైరల్‌ అవుతోన్న వీడియో..

బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా తొలి బుల్లెట్‌ రైలు కోసం నిర్మించిన స్టేషన్ వీడియోను కేంద్ర మంత్రి షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సబర్మతి మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కారిడార్‌ హబ్‌లో ఈ స్టేషన్‌ను నిర్మించారు. దేశంలోనే తొలిసారి చేపట్టిన హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మాణంలో భాగంగా ఈ స్టేషన్‌ నిర్మాణం చేపట్టారు. అత్యాధునిక సదుపాయాలతో ఈ స్టేషన్‌ను నిర్మించినట్లు..

Bullet Train: దేశంలో తొలి బుల్లెట్‌ ట్రైన్ స్టేషన్‌.. వైరల్‌ అవుతోన్న వీడియో..
Bullet Train Station
Narender Vaitla
|

Updated on: Dec 08, 2023 | 2:31 PM

Share

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టును చేపడుతోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా అహ్మదాబాద్‌ నుంచి ముంబయికి తొలి బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుంది. ఇందులో భాగంగానే ఈ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ కీలక ప్రకటన చేశారు.

బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా తొలి బుల్లెట్‌ రైలు కోసం నిర్మించిన స్టేషన్ వీడియోను కేంద్ర మంత్రి షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సబర్మతి మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కారిడార్‌ హబ్‌లో ఈ స్టేషన్‌ను నిర్మించారు. దేశంలోనే తొలిసారి చేపట్టిన హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మాణంలో భాగంగా ఈ స్టేషన్‌ నిర్మాణం చేపట్టారు. అత్యాధునిక సదుపాయాలతో ఈ స్టేషన్‌ను నిర్మించినట్లు స్పష్టమవుతోంది.

బుల్లెట్ ట్రైన్ స్టేషన్‌ను జంట భవనాలుగా రూపొందించారు. స్టేషన్‌కు అవతల గోడలపై ఉప్పు సత్యాగ్రహం సన్నివేశాలకు సంబంధించిన భారీ చిత్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్‌ను మొత్తం 1,33,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్‌లో ఆఫీస్‌లు, వాణిజ్య కార్యాలయాలు, రిటైల్‌ స్టోర్లు ఏర్పాటు చేసుకొనే విధంగా నిర్మించారు.

కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ ట్వీట్..

ఇదిలా ఉంటే ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ పూర్తయితే.. ముంబయి-అహ్మదాబాద్ మధ్య ప్రయాణం 2 గంటల్లోనే పూర్తవుతుంది. ఈ రైలు గరిష్టంగా గంటలకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఇక ఈ బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రధాని మోదీ, అప్పటి జపాన్‌ పీఎం షింజో అబేల మధ్య 2017లో ఒప్పందం కుదిరింది. ఈ బుల్లెట్‌ ట్రైన్​ ప్రాజెక్ట్​ కోసం రూ. 1.08 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే