Covid Deaths: కరోనా మృతులకు రూ.50 వేల పరిహారం.. అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు..!

|

Sep 28, 2021 | 10:02 PM

Covid Deaths: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినా.. ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకుంది...

Covid Deaths: కరోనా మృతులకు రూ.50 వేల పరిహారం.. అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు..!
Follow us on

Covid Deaths: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినా.. ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకుంది. వైరస్‌ కారణంగా మృతిచెందిన కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజాగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనాతో మృతి చెందిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (SDRF) కింద వీటిని అందజేయాలని అన్ని రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలకు రాసిన లేఖలో కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఇదే సమయంలో దీనిపై స్పందించిన ఒడిశా ప్రభుత్వం.. కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం ఇస్తామని ప్రకటించింది.

కేంద్ర ఆరోగ్యశాఖ, భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం.. ధృవీకరించిన కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయాన్ని అందజేసేలా చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. దేశంలో కరోనా వ్యాప్తి వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకూ మరణించిన కేసులకే కాకుండా భవిష్యత్తులో కోవిడ్‌-19తో సంభవించే మరణాలకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ పరిహారం మొత్తాన్ని రాష్ట్ర విపత్తు స్పందన నిధి (SDRF) కింద అందజేసే చర్యలు చేపట్టాలని రాష్ట్ర /కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

కోవిడ్‌ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలంటూ న్యాయవాది గౌరవ్‌ కుమార్‌ బన్సాల్‌ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.50వేల పరిహారాన్ని అందించాలంటూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థ (NDMA) సిఫార్సు చేసిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాకుండా కరోనా రోగులకు సేవలు అందిస్తూ వైరస్‌ బారినపడి మృతి చెందిన వారి కుటుంబాలకు కూడా పరిహారం అందజేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. దీనిపై తుది తీర్పును అక్టోబర్‌ 4వ తేదీన వరకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

ఇవీ కూడా చదవండి:

AP Covid 19: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. రాష్ట్రంలో కొత్త నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే..?

R.1 COVID Variant: మానవాళిపై పగబట్టిన కోవిడ్.. కొత్తవేరియంట్ గుర్తింపు.. 35 దేశాల్లో 10వేల మంది బాధితులు