PM Modi: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం.. ఈ స్కీమ్‌ను డిజిటల్‌ మిషన్‌కు ఆమోదం..!

PM Modi: మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్ మిషన్ (ABDM)కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. శనివారం ప్రధాని నరేంద్రమోడీ (PM Narendra Modi)..

PM Modi: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం.. ఈ స్కీమ్‌ను డిజిటల్‌ మిషన్‌కు ఆమోదం..!
PM Modi
Image Credit source: TV9 Telugu

Updated on: Feb 26, 2022 | 6:49 PM

PM Modi: మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్ మిషన్ (ABDM)కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. శనివారం ప్రధాని నరేంద్రమోడీ (PM Narendra Modi) అధ్యక్షుతన కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. కేబినెట్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌  స్కీమ్‌ను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్‌ కోసం వచ్చే ఐదేళ్లకు గానూ 1,600 కోట్ల కేటాయించింది కేంద్రం. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ స్కీమ్‌ను నేషనల్‌ హెల్త్‌ అథారిటీ (NHA) అమలు చేస్తోంది.

ఈ స్కీమ్‌ కింద పౌరులు ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌కు సంబంధించిన రికార్డులను డిజిటల్‌గా నమోదు చేసుకోవచ్చు. ఈ రికార్డులు వైద్య రంగంలో సేవలందించేవారికి ఉపయోగపడతాయి. డిజిటల్‌ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన వైద్య సేవలు పొందే వీలవుతుందనే ఉద్దేశంతో ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌ కింద ఇప్పటివరకు 17 కోట్లకు పైగా ఖాతాలు ఓపెన్‌ అయినట్లు కేంద్రం తెలిపింది.

ఇవి కూడా చదవండి:

UP Elections: పూర్వాంచల్‌లో బీజేపీ పట్టు నిలుస్తుందా? ఎస్పీ గెలుపు ఆశలపై బీఎస్పీ నీళ్లు చల్లుతుందా?

Zelenskyy: నేను దేశం విడిచి వెళ్లే ప్రసక్తే లేదు.. రష్యాతో అమీతుమీ తేల్చుకుంటాం: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

 

Loading...
Unable to load recommendations.
Follow Us