సీఏఏ చట్టబధ్ధమైనదే.. కోర్టుల్లో ఎవరూ సవాల్ చేయలేరు.. కేంద్రం

సవరించిన పౌరసత్వ చట్టం (సీఏఏ) పూర్తిగా చట్టబధ్ధమైనది,రాజ్యాంగబధ్ధమైనదని కేంద్రం స్పష్టం చేసింది. ఇది పార్లమెంట్ సార్వభౌమాధికారానికి సంబంధించినదని,  కోర్టులో ఎవరూ సవాలు చేయజాలరని పేర్కొంది

సీఏఏ చట్టబధ్ధమైనదే.. కోర్టుల్లో ఎవరూ సవాల్ చేయలేరు.. కేంద్రం

Edited By:

Updated on: Mar 17, 2020 | 3:53 PM

సవరించిన పౌరసత్వ చట్టం (సీఏఏ) పూర్తిగా చట్టబధ్ధమైనది,రాజ్యాంగబధ్ధమైనదని కేంద్రం స్పష్టం చేసింది. ఇది పార్లమెంట్ సార్వభౌమాధికారానికి సంబంధించినదని,  కోర్టులో ఎవరూ సవాలు చేయజాలరని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు సమర్పించిన తన ప్రిలిమినరీ అఫిడవిట్ లో వెల్లడించింది. రాజ్యాంగంలోని 246 అధికరణం కింద.. ఏడో షెడ్యూల్ లిస్టులోని ఏ అంశానికి సంబంధించిన విషయంపై అయినా చట్టాలు చేసే అసాధారణ అధికారాలు పార్లమెంటుకు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం  తెలిపింది.ఈ చట్టం ఏ భారతీయ పౌరుడి  హక్కులను కాలరాయడంలేదని, ప్రజల సెక్యులర్ లేదా లీగల్ లేక ప్రజాస్వామ్య హక్కులకు భంగకరం కూడా కాదు. అని వివరించింది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లలో.. ఇక్కడి మైనారిటీల పట్ల ఇది నిర్లక్ష్యం చూపేదిగా ఉందని ఏ పిటిషన్ కూడా స్పష్టం చేయలేదని, ఈ అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సీఏఏని వ్యతిరేకిస్తూ వందకు పైగా దాఖలైన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది.