
న్యూఢిల్లీ: ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామాల్లో కీలకంగా మారిన బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో బ్రిక్స్ సమ్మిట్-2026 జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కీలక సమావేశానికి సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్ను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
బ్రిక్స్ సభ్య దేశాల నాయకులతో పాటు భాగస్వామ్య దేశాల అధినేతలు, ఆహ్వానితులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. భారత అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో ప్రపంచ పాలన, బహుపాక్షికవాదం, ఆర్థిక సహకారం, సాంకేతికత, సుస్థిర అభివృద్ధి, భవిష్యత్ ప్రపంచ వృద్ధి వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 12.. తొలి రోజు షెడ్యూల్ ఇదే:
బ్రిక్స్, విదేశాంగ మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానెళ్లు, దూరదర్శన్ ద్వారా పలు కార్యక్రమాలకు సంబంధించిన క్లీన్ ఫీడ్లు అందుబాటులో ఉంటాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఫొటోలను BRICS Flick ద్వారా అందించే ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది.
సెప్టెంబర్ 13.. భాగస్వామ్య దేశాల నేతల రాక
ఈ సమావేశం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సమ్మిళిత వృద్ధి, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలు, సాంకేతిక ఆవిష్కరణలు, వాతావరణ మార్పులు, సుస్థిరత, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై బ్రిక్స్ దేశాల వైఖరి వెల్లడయ్యే అవకాశం ఉంది.
భారత్ అధ్యక్షతలో కీలక అజెండా
2026 జనవరి 1న భారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. భారత అధ్యక్షతకు “స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం – సుస్థిరత” అనే థీమ్ను నిర్దేశించారు. బ్రిక్స్ మూడు ప్రధాన సహకార స్తంభాలైన రాజకీయ-భద్రతా సహకారం, ఆర్థిక-ద్రవ్య సహకారం, సాంస్కృతిక-ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై భారత్ దృష్టి పెట్టింది. భారత అధ్యక్షతలో ఇప్పటికే పలు మంత్రివర్గ స్థాయి సమావేశాలు, అధికారిక చర్చలు, నిపుణుల సమావేశాలు నిర్వహించారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ముందు దేశవ్యాప్తంగా 25కు పైగా నగరాల్లో 350కుపైగా సమావేశాలు, ఉన్నత స్థాయి సంప్రదింపులు నిర్వహించినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
బ్రిక్స్లో ఎన్ని దేశాలు?
ప్రస్తుతం బ్రిక్స్లో 11 పూర్తి సభ్య దేశాలు ఉన్నాయి. అవి:
1. బ్రెజిల్
2. రష్యా
3. భారత్
4. చైనా
5. దక్షిణాఫ్రికా
6. ఈజిప్ట్
7. ఇథియోపియా
8. ఇండోనేషియా
9. ఇరాన్
10. సౌదీ అరేబియా
11. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
ఇండోనేషియా 2025 జనవరిలో బ్రిక్స్ పూర్తి సభ్యదేశంగా చేరింది. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈలు పూర్తి సభ్యులుగా చేరగా.. 2025లో ఇండోనేషియా సభ్యత్వం పొందింది.
బ్రిక్స్ భాగస్వామ్య దేశాలు ఇవే:
పూర్తి సభ్యత్వంతో పాటు బ్రిక్స్లో పార్ట్నర్ కంట్రీస్ అనే ప్రత్యేక వర్గం కూడా ఉంది. ప్రస్తుత భాగస్వామ్య దేశాల్లో బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, నైజీరియా, థాయ్లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం ఉన్నాయి. ఈ దేశాలను అవసరాన్ని బట్టి బ్రిక్స్ సమావేశాలకు ఆహ్వానిస్తారు. బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉన్నప్పుడు ఇతర సమావేశాల్లో కూడా భాగస్వామ్య దేశాలు పాల్గొనే అవకాశం ఉంటుంది.
2026 సమ్మిట్కు ప్రత్యేక ప్రాధాన్యత ఎందుకు?
బ్రిక్స్ ఏర్పాటుకు 2026లో రెండు దశాబ్దాలు పూర్తవుతున్నాయి. 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా దేశాల సహకారంతో BRICగా ప్రారంభమైన ఈ వేదికలో 2010లో దక్షిణాఫ్రికా చేరడంతో BRICSగా మారింది. తొలి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2009లో రష్యాలోని యెకటెరిన్బర్గ్లో జరిగింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యంలో బ్రిక్స్ దేశాల వాటా గణనీయంగా ఉంది. అందువల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపించేందుకు ఈ కూటమి ఒక ముఖ్యమైన వేదికగా పరిగణించబడుతోంది.
ప్రపంచ అంశాలపై కీలక చర్చలకు అవకాశం
న్యూఢిల్లీలో జరిగే 18వ బ్రిక్స్ సమ్మిట్లో ప్రపంచ పాలనలో సంస్కరణలు, బహుపాక్షిక వ్యవస్థ బలోపేతం, ఆర్థిక సహకారం, వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, ఆహార-ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలు ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాలన్న అంశం కూడా చర్చల్లో కీలకంగా మారే అవకాశం ఉంది.
భారత్ అధ్యక్షతలో ఏడాది పాటు జరిగిన బ్రిక్స్ కార్యక్రమాలకు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరిగే నాయకుల శిఖరాగ్ర సమావేశం పరాకాష్టగా నిలవనుంది. సభ్య, భాగస్వామ్య దేశాల నాయకులు ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించడంతో పాటు బ్రిక్స్ భవిష్యత్ సహకారానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
A global stage. A shared purpose.
Bharat Mandapam is getting ready for the 18th BRICS Summit.#BRICS2026 #BRICSIndia2026 #IndiaBRICSChairship pic.twitter.com/8IkyqWutED
— BRICS 2026 (@BricsIndia2026) September 9, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..