నాలుగోసారి.. సీఎం పీఠమెక్కిన చౌహాన్..

| Edited By:

Mar 24, 2020 | 7:26 AM

ఎన్నో మలుపులు తిరిగి.. చివరకు మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం సోమవారంతో ముగిసింది. బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. మధ్యప్రదేశ్‌ సీఎంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ లాల్జీ టాండన్‌ రాత్రి 9.00 గంటలకు చౌహాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో నాలుగు సార్లు మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలతో పాటుగా.. మాజీ సీఎం కమల్‌నాథ్‌ కూడా హాజరయ్యారు. […]

నాలుగోసారి.. సీఎం పీఠమెక్కిన చౌహాన్..
Follow us on

ఎన్నో మలుపులు తిరిగి.. చివరకు మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం సోమవారంతో ముగిసింది. బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. మధ్యప్రదేశ్‌ సీఎంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ లాల్జీ టాండన్‌ రాత్రి 9.00 గంటలకు చౌహాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో నాలుగు సార్లు మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలతో పాటుగా.. మాజీ సీఎం కమల్‌నాథ్‌ కూడా హాజరయ్యారు.

కాగా.. అంతకుముందు.. సోమవారం సాయంత్రం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చౌహాన్‌ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయడంతో.. కొత్త మంత్రి వర్గాన్ని వచ్చే వారంలో విస్తరించే అవకాశం ఉంది.

మరోవైపు కేబినెట్ విస్తరణలో.. జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి పెద్ద పీఠ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయన..తన వెంట 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెచ్చుకున్నారు. సింధియా బీజేపీలో చేరిన అనంతరం.. ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీ గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో కమల్ నాథ్‌ సర్కార్ మైనార్టీలో పడిపోయింది.
మొత్తం 230 మంది సభ్యులు ఉన్న మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ప్రస్తుతం 107 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో.. పార్టీ బలం 92 మందికి పడిపోయింది. దీంతో సభ బలం 206కు తగ్గి.. మెజార్టీ 104కి పడిపోయింది. అయితే అప్పటికే బీజేపీకి 107 ఉండటంతో.. ఇతర పార్టీల మద్దతు లేకుండానే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.