BJP: బీజేపీ ఎంపీలకు విప్ జారీ.. లోక్‌సభకు అందరూ హాజరవ్వాలని సూచించిన అధిష్టానం..

|

Feb 10, 2021 | 1:19 PM

Bharatiya Janata Party: భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ ఎంపీలకు బుధవారం విప్ జారీ చేసింది. బీజేపీ పార్లమెంట్ సభ్యులందరూ ఈ రోజు జరిగే లోక్‌సభకు హాజరుకావాలని.. ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని పార్టీ అదిష్టానం ఆదేశించింది. ఈ మేరకు బీజేపీ..

BJP: బీజేపీ ఎంపీలకు విప్ జారీ.. లోక్‌సభకు అందరూ హాజరవ్వాలని సూచించిన అధిష్టానం..
Follow us on

Bharatiya Janata Party: భారతీయ జనతా పార్టీ తమ ఎంపీలకు బుధవారం విప్ జారీ చేసింది. మీరంతా ఈ రోజు జరిగే లోక్‌సభ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరుకావాలని.. ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని పార్టీ అదిష్టానం ఆదేశించింది. ఈ మేరకు బీజేపీ.. తమ పార్టీ ఎంపీలకు మూడు లైన్లతో విప్‌ను జారీచేసింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగిన అనంతరం ఈ రోజు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు మద్దతుగా ఎంపీలందరూ సభలో ఉండాలంటూ అధిష్ఠానం ఈ విప్‌ను జారీ చేసి పలు సూచనలు చేసింది. ఎంపీలంతా అందుబాటులో ఉండాలని ఆదేశాలిచ్చింది. అయితే ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ప్రసంగించనున్నారు.

Also Read:

ఆజాద్‌ను కాంగ్రెస్ రాజ్యసభకు నామినేట్ చేయకపోతే.. మేం చేస్తాం: కేంద్ర మంత్రి అథవాలే సంచలన వ్యాఖ్యలు

Farm Laws: కనీస మద్దతు ధర ఎప్పుడూ ఉంటుంది.. రైతులు ఉద్యమాన్ని వీడి చర్చకు రావాలి: ప్రధాని మోదీ