Ayodhya: రాముడి రూపంలో యోగి ఆదిత్యనాథ్‌… అయోధ్యలో గుడి, ప్రత్యేక పూజలు ప్రసాదాలు..

|

Sep 19, 2022 | 9:00 PM

ఆలయంలో ముఖ్యమంత్రి విగ్రహం ముందు ప్రతిరోజూ రెండుసార్లు అంటే ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. పూజల అనంతరం భక్తులకు ప్రసాదం కూడా పంపిణీ చేస్తారు.

Ayodhya: రాముడి రూపంలో యోగి ఆదిత్యనాథ్‌… అయోధ్యలో గుడి, ప్రత్యేక పూజలు ప్రసాదాలు..
Yogi Adityanath
Follow us on

Ayodhya: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అంకితం చేసిన ఒక ఆలయం వెలుగులోకి వచ్చింది. భరత్‌కుండ్ సమీపంలోని పూర్వా గ్రామంలోని ఈ ఆలయంలో యోగి ఆదిత్యనాథ్‌ను రాముడి అవతారంగా ఏర్పాటు చేశారు. ఆలయంలో ముఖ్యమంత్రి విగ్రహం ముందు ప్రతిరోజూ రెండుసార్లు అంటే ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. పూజల అనంతరం భక్తులకు ప్రసాదం కూడా పంపిణీ చేస్తారు.

భరత్‌కుండ్ రాముడు అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు అతని సోదరుడు భరత్ అతనికి వీడ్కోలు పలికిన ప్రదేశం అని నమ్ముతారు. ఈ ఆలయాన్ని అయోధ్య నివాసి ప్రభాకర్ మౌర్య నిర్మించారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించే వ్యక్తిని పూజిస్తానని 2015లో మౌర్య ప్రతిజ్ఞ చేశారు. శ్రీ మౌర్య మాట్లాడుతూ తాను రాముడి కోసం చేసినట్లే ప్రతి రోజూ యోగి ఆదిత్యనాథ్ విగ్రహం ముందు శ్లోకాలు పఠిస్తూ ఉంటానని చెప్పాడు. యూపీలోని బారాబంకి జిల్లాకు చెందిన తన స్నేహితుడు రెండు నెలల్లో రాముడిని పోలిన యోగి ఆదిత్యనాథ్‌ విగ్రహాన్ని తయారు చేసినట్లు ఆయన వెల్లడించాడు. ఆలయ నిర్మాణానికి దాదాపు ₹ 8.5 లక్షలు ఖర్చు చేసినట్టుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

గతేడాది పూణెలో ప్రధాని నరేంద్ర మోడీకి ఓ బీజేపీ కార్యకర్త ఆలయాన్ని నిర్మించారు. ప్రధాని అయిన తరువాత మోడీ చాలా అభివృద్ధి పనులు చేసాడని చెప్పాడు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించిన వ్యక్తికి గుడి ఉండాలి కాబట్టి ఈ ఆలయాన్ని నా సొంత స్థలంలో నిర్మించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిపాడు ఆలయాన్ని నిర్మించిన మయూర్ ముండే .

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి