
దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ వెల్లడించింది. ఈసారి పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో మే 7న.. తమిళనాడులో మే 10న.. అసోంలో మే 20న..కేరళంలో మే 23న.. పుదుచ్చేరిలో జూన్ 15న అసెంబ్లీ పదవికాలం ముగియనుంది. ఎన్నికల తేదీలు ప్రకటించడంతో వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల షెడ్యూల్ వివరాలు దిగువన చూడండి…
Tamil Nadu Schedule
Kerala Schedule
West Bengal Schedule
Puducherry Schedule
Assam Schedule
మరోవైపు ఎన్నికల ప్రకటనకు ముందే రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ వరుస పర్యటనలతో బిజీ కాబోతున్నారు. ఇప్పటికే అసోంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. షిల్లాంగ్-సిల్చార్ కారిడార్ వంటి భారీ ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా అభివృద్ధి అజెండాను ముందుకు తీసుకువస్తున్నారు. త్వరలోనే బెంగాల్, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో కూడా పలు సభలు నిర్వహించే ప్రణాళిక సిద్ధమవుతోంది. బెంగాల్లో పరిశ్రమలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తూ రాజకీయ సందేశం ఇవ్వాలన్న లక్ష్యం కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలం పెంచే లక్ష్యంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ ర్యాలీలు నిర్వహించాలి బీజేపీ అగ్రనాయకత్వం ప్లాన్ చేస్తోంది.