
ఆ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. ఇందులో ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది . త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరుగుతాయని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ వెల్లడించారు. మేఘాలయా, నాగాలండ్ అసెంబ్లీలకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు. మార్చి 2న మూడు రాష్ట్రాల ఫలితాల లెక్కింపు ఉంటుందని తెలిపారు. మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
మూడు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్లో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఈ మూడు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. మహిళా ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. మేము జనవరి 11 నుండి 14 వరకు మూడు రాష్ట్రాల పర్యటనలో ఉన్నామని అన్నారు. ఇందులో 17 ఏళ్లు నిండి 18 ఏళ్లు నిండని వారికి 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటరు కార్డు పొంది వారి పేర్లను చేర్చేలా ముందస్తు సమాచారం అందించే ఏర్పాటు చేశామన్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో 10వేల మంది రిజిస్టర్ చేసుకున్నారని.. మూడు రాష్ట్రాల్లో 9వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉంటాయన్నారు. వీటిలో 376 పూర్తిగా మహిళలే నిర్వహించనున్నారని అన్నారు.
Voting for Assembly elections in Tripura to be held on February 16 & in Nagaland & Meghalaya on February 27; results to be declared on March 2.#AssemblyElections2023 https://t.co/V8eOZvhc5g pic.twitter.com/rRNKWeNjUq
— ANI (@ANI) January 18, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం